COVID in India: దేశంలో 4 వేలు దాటిన కరోనా యాక్టివ్ కేసులు, గత 24 గంటల్లో 602 కొత్త కేసులు నమోదు, 263కు పెరిగిన సబ్ వేరియంట్ జేఎన్.1 కేసులు
కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ (Health Ministry) వెల్లడించిన వివరాల ప్రకారం.. మంగళవారం ఉదయం 8 గంటల నుంచి బుధవారం ఉదయం 8 గంటల వరకూ 24 గంటల వ్యవధిలో 602 కరోనా కేసులు బయటపడ్డాయి. తాజా కేసులతో కలిపి దేశంలో ప్రస్తుతం క్రియాశీల కేసుల సంఖ్య 4,440కి చేరింది.
కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ (Health Ministry) వెల్లడించిన వివరాల ప్రకారం.. మంగళవారం ఉదయం 8 గంటల నుంచి బుధవారం ఉదయం 8 గంటల వరకూ 24 గంటల వ్యవధిలో 602 కరోనా కేసులు బయటపడ్డాయి. తాజా కేసులతో కలిపి దేశంలో ప్రస్తుతం క్రియాశీల కేసుల సంఖ్య 4,440కి చేరింది. ఇక నిన్న ఒక్కరోజే 5 మరణాలు నమోదయ్యాయి. దీంతో కరోనా కారణంగా మరణించిన వారి సంఖ్య 5,33,371కి పెరిగింది. దేశంలో ఇప్పటి వరకూ 4,44,77,272 మంది వైరస్ నుంచి కోలుకున్నారు.
ఇక భారత్లో కరోనా సబ్ వేరియంట్ జేఎన్.1 (JN.1) కేసులు 200 దాటాయి. ఇప్పటి వరకూ జేఎన్.1 కేసులు 263కు చేరినట్లు ఇండియన్ సార్స్ కోవ్ 2 జెనోమిక్స్ కన్సార్టియం (INSACOG) మంగళవారం వెల్లడించింది. పది రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు కొత్త వేరియంట్ విస్తరించిందని పేర్కొంది.
Here's ANI News
COVID-19 | India reports 602 new cases, 5 deaths in the last 24 hours; Active caseload at 4,440
— ANI (@ANI) January 3, 2024
(SocialLY brings you all the latest breaking news, fact checks and information from social media world, including Twitter (X), Instagram and Youtube. The above post contains publicly available embedded media, directly from the user's social media account and the views appearing in the social media post do not reflect the opinions of LatestLY.)
(The above story first appeared on LatestLY on Jan 03, 2024 03:01 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

