XE COVID Variant: దేశంలో మరో కొత్త వేరియంట్ కలకలం, ప్రమాదకర కరోనా ఎక్స్ఈ వేరియంట్ కేసును గుర్తించిన INSACOG
భారతదేశంలో కరోనా ఎక్స్ఈ వేరియంట్ కేసు ఒకటి నమోదైంది. ఇండియన్ సార్స్- సీఓవీ2 జీనోమిక్స్ సీక్వెన్సింగ్ కన్సార్షియం(ఐఎన్ఎస్ఏసీఓజీ) ఏప్రిల్ 25కు సంబంధించి మంగళవారం విడుదల చేసిన బులెటిన్లో ఈ విషయాన్ని పేర్కొంది.
భారతదేశంలో కరోనా ఎక్స్ఈ వేరియంట్ కేసు ఒకటి నమోదైంది. ఇండియన్ సార్స్- సీఓవీ2 జీనోమిక్స్ సీక్వెన్సింగ్ కన్సార్షియం(ఐఎన్ఎస్ఏసీఓజీ) ఏప్రిల్ 25కు సంబంధించి మంగళవారం విడుదల చేసిన బులెటిన్లో ఈ విషయాన్ని పేర్కొంది. అయితే, ఈ కేసు ఏ ప్రాంతంలో నమోదైందనే వివరాలను మాత్రం చెప్పలేదు. గత వారంతో పోలిస్తే దేశంలోని 12 రాష్ట్రాల్లో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య పెరిగిందని, 19 రాష్ట్రాల్లో కేసులు తగ్గుముఖం పట్టాయని వెల్లడించింది.
అత్యంత ఎక్కువగా సంక్రమించే శక్తి ఉందని భావిస్తున్నఈ వేరియంట్ ఇదివరకే గుజరాత్, మహారాష్ట్ర రాష్ట్రాల్లో వెలుగు చూసినట్లు వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. అయితే వాటిపై ఖచ్చితమైన నిర్ధారణ లేదు. తాజాగా వైరస్ జన్యుసంక్రమణాన్ని గుర్తించే ల్యాబొరేటరీల ప్రభుత్వం కన్సార్షియం (ఇన్సా కాగ్) దీనిపై స్పష్టత ఇచ్చింది. ఒమిక్రాన్ ఉపరకాలైన బి ఏ 1, బి ఏ, 2ల కలయికగా భావిస్తున్న ఎక్స్ఈ తొలుత బ్రిటన్లో వెలుగుచూసింది. ఆ తర్వాత పలు దేశాలకు పాకింది.
COVID-19 XE Variant in India: 'One Confirmed Case of XE COVID Variant Detected in India', Says INSACOG#COVID19 #CovidXEVariant #INSACOG #CovidXEConfirmedCase #NationalNewshttps://t.co/sICnmh38Hd
— LatestLY (@latestly) May 3, 2022
(SocialLY brings you all the latest breaking news, fact checks and information from social media world, including Twitter (X), Instagram and Youtube. The above post contains publicly available embedded media, directly from the user's social media account and the views appearing in the social media post do not reflect the opinions of LatestLY.)
(The above story first appeared on LatestLY on May 04, 2022 03:02 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

