దేశంలో కొత్తగా 16,135 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసులు 4,35,18,564కు చేరాయి. ఇందులో 4,28,79,477 మంది బాధితులు కోలుకోగా, 5,25,223 మంది మృతిచెందారు. మరో 1,13,864 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. గత 24 గంటల్లో 24 మంది మరణించగా, 13,958 మంది బాధితులు డిశ్చార్జీ అయ్యారు. ఇక గత కొన్నిరోజులుగా భారీసంఖ్యలో యాక్టివ్‌ కేసులు నమోదవుతుండటంతో 4.85 శాతానికి పెరిగాయని కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది. అదేవిధంగా యాక్టివ్‌ కేసులు 0.26 శాతం, రికవరీ రేటు 98.54 శాతం, మరణాల రేటు 1.21 శాతంగా ఉన్నాయని తెలిపింది. ఇప్పటివరకు 197.98 కోట్ల వ్యాక్సిన్‌ డోసులను పంపిణీ చేశామని ప్రకటించింది.

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)