స్పైస్‌జెట్ సంస్థ‌లో ప‌నిచేస్తున్న 90 మంది పైలెట్ల‌పై డైర‌క్ట‌రేట్ జ‌న‌ర‌ల్ ఆఫ్ సివిల్ ఏవియేష‌న్‌(డీజీసీఏ) వేటు వేసింది. బోయింగ్ 737 మ్యాక్స్ విమానాలు న‌డుపుతున్న పైలెట్ల‌పై ఆ చ‌ర్య‌లు తీసుకున్న‌ది. మ్యాక్స్ విమానాలు న‌డుతుపున్న పైలెట్లు స‌రైన రీతిలో శిక్ష‌ణ పొంద‌లేద‌ని, వాళ్లు మ‌ళ్లీ శిక్ష‌ణ తీసుకుని విధుల్లో చేరాల‌ని డీజీసీఏ త‌న ఆదేశాల్లో పేర్కొన్న‌ది. విజ‌య‌వంతంగా మ్యాక్స్ విమానాల ట్రైనింగ్ తీసుకున్న త‌ర్వాత పైలెట్లు విధుల్లో చేరుతార‌ని డీజీసీఏ బాస్ అరుణ్ కుమార్ తెలిపారు.

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)