Gautam Adani Bribery Case: అమెరికా న్యాయశాఖ ఇచ్చిన తీర్పుపై కోర్టుకు వెళ్లనున్న అదాని గ్రూపు, సంస్థపై వచ్చిన ఆరోపణలు నిరాధారమైనవని కొట్టివేత
గౌతం అదానీ గ్రూపు(Adani Group)పై అమెరికా న్యాయశాఖ చేసిన ఆరోపణలను adani group కంపెనీ కొట్టిపారేసింది. ఆ ఆరోపణలు నిరాధారమైనవని పేర్కొన్నది. ఈ మేరకు అదానీ సంస్థ ఓ ప్రకటన రిలీజ్ చేసింది.
గౌతం అదానీ గ్రూపు(Adani Group)పై అమెరికా న్యాయశాఖ చేసిన ఆరోపణలను adani group కంపెనీ కొట్టిపారేసింది. ఆ ఆరోపణలు నిరాధారమైనవని పేర్కొన్నది. ఈ మేరకు అదానీ సంస్థ ఓ ప్రకటన రిలీజ్ చేసింది. ప్రకటనలో అమెరికా న్యాయశాఖ ఇచ్చిన తీర్పుపై లీగల్ చర్యలు తీసుకోనున్నట్లు అదానీ సంస్థ వెల్లడించింది. అత్యున్నత స్థాయి పరిపాలన, పారదర్శకతకు కట్టుబడి అదానీ గ్రూపు పనిచేస్తుందన్నారు. తమ సంస్థ చట్టానికి లోబడి పనిచేస్తుందని వాటాదారులకు, భాగస్వామ్యులకు, ఉద్యోగులకు చెబుతున్నట్లు ఆ ప్రకటనలో పేర్కొన్నారు.
సోలార్ పవర్ ప్రాజెక్టు కోసం అదానీ గ్రీన్ కంపెనీకి చెందిన డైరెక్టర్లు.. అమెరికా పెట్టుబడీదారులకు ముడుపులు ఇచ్చే ప్రయత్నం చేసినట్లు అమెరికా కోర్టు పేర్కొన్నది. ఆ కేసులో గౌతం అదానీతో పాటు మరో ఏడుగురికి అరెస్టు వారెంట్ జారీ చేసింది. అమెరికా న్యాయశాఖ ప్రకారం.. నేరాభియోగాలు కేవలం ఆరోపణలు మాత్రమే అని, దోషులుగా తేలే వరకు డిఫెండెంట్లను అమాయకులుగా భావించాలని కోర్టు చెప్పినట్లు ఆ స్టేట్మెంట్లో తెలిపారు.
Adani Group Denies US Bribery Charges
Know more: https://t.co/uNYlCaBbtk pic.twitter.com/fQ4wdJNa9d
— Adani Group (@AdaniOnline) November 21, 2024
(SocialLY brings you all the latest breaking news, fact checks and information from social media world, including Twitter (X), Instagram and Youtube. The above post contains publicly available embedded media, directly from the user's social media account and the views appearing in the social media post do not reflect the opinions of LatestLY.)
(The above story first appeared on LatestLY on Nov 21, 2024 04:13 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

