"భారత్ మాతా కీ జై" అని నినాదాలు చేయడం ద్వేషపూరిత ప్రసంగం కాదని, మతాల మధ్య వైషమ్యాలు లేదా శత్రుత్వాన్ని పెంపొందించినట్లుగా భావించలేమని కర్ణాటక హైకోర్టు ఇటీవల పేర్కొంది. ఇండియన్ పీనల్ కోడ్ (ఐపీసీ)లోని సెక్షన్ 153ఏ కింద ఐదుగురిపై నమోదైన ఎఫ్‌ఐఆర్‌ను కొట్టివేస్తూ హైకోర్టు వ్యాఖ్యానించింది. వివిధ వర్గాల మధ్య శత్రుత్వాన్ని పెంపొందించారని, సామరస్య పరిరక్షణకు విఘాతం కలిగించే చర్యలకు పాల్పడ్డారని అభియోగాలు మోపిన ఐదుగురు నిందితులకు జస్టిస్ ఎం నాగప్రసన్న సింగిల్ బెంచ్ న్యాయమూర్తి రిలీఫ్ మంజూరు చేశారు.

 తెలంగాణ సీఎంఆర్‌ఎఫ్‌కి రిలయన్స్ ఫౌండేషన్ భారీ విరాళం, రూ.20 కోట్లు సీఎం రేవంత్‌ రెడ్డికి అందజేసిన రిలయన్స్ ఫౌండేషన్ ప్రతినిధులు

కర్ణాటకలోని ఉల్లాల్ తాలూకాకు చెందిన ఐదుగురిపై ఈ ఏడాది జూన్‌లో పోలీసులు కేసు నమోదు చేశారు. కేసు వివరాల ప్రకారం, జూన్ 9న, పిటిషనర్లు ప్రధాని నరేంద్ర మోడీ ప్రమాణ స్వీకారోత్సవం జరుపుకునే కార్యక్రమంలో పాల్గొని తిరిగి వస్తుండగా, కొంతమంది వ్యక్తులు వారిపై దాడి చేశారు. 'భారత్ మాతా కీ జై' అని నినాదాలు చేస్తున్నందున తమపై దాడి చేసి, కత్తితో పొడిచిన గుంపు తమను ప్రశ్నించిందని పిటిషనర్లు తమ పిటిషన్‌లో పేర్కొన్నారు.

Here's News

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)