దేశంలో కరోనా కేసులు స్వల్పంగా పెరిగాయి. గురువారం 1033 కేసులు నమోదవగా, తాజాగా అవి 1109కి పెరిగాయి. దీంతో మొత్తం కేసులు 4,30,33,067కు చేరాయి. ఇందులో 4,25,00,002 మంది బాధితులు కరోనా నుంచి కోలుకున్నారు. మరో 11,492 మంది చికిత్స పొందుతుండగా, 5,21,573 మంది మృతిచెందారు. కాగా, గత 24 గంటల్లో 1213 మంది బాధితులు వైరస్‌ నుంచి బయటపడగా, 43 మంది మరణించారని కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. మొత్తం కేసుల్లో 0.03 శాతం కేసులు మాత్రమే యాక్టివ్‌గా ఉన్నాయని, రికవరీ రేటు 98.76 శాతం, మరణాలు 1.21 శాతంగా ఉన్నాయని తెలిపింది. ఇక ఇప్పటివరకు 1,85,38,88,663 వ్యాక్సిన్‌ డోసులను పంపిణీ చేశామని, నిన్న ఒకేరోజు 16,80,118 మందికి వ్యాక్సినేషన్‌ చేశామని వెల్లడించింది

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)