దేశంలో గడిచిన 24 గంటల్లో కొత్తగా 1,247 కేసులు రికార్డయ్యాయని కేంద్ర కుటుంబ ఆరోగ్యమంత్రిత్వ శాఖ తెలిపింది. నిన్నటితో పోలిస్తే 43శాతం కేసులు తగ్గాయని పేర్కొంది. మరో మరణాలు సైతం భారీగా తగ్గాయి. కరోనాతో గడిచిన 24 గంటల్లో ఒకరు మృతి చెందారు. తాజాగా 928 మంది బాధితులు కోలుకొని డిశ్చార్జి అయ్యారు. తాజాగా కేసులతో కలిపి దేశంలో మొత్తం పాజిటివ్‌ కేసుల సంఖ్య 4,30,45,527కు పెరిగింది. ఇందులో 4,25,11,701 మంది బాధితులు కోలుకున్నారు. కరోనా మహమ్మారి ప్రభావంతో ఇప్పటి వరకు 5,21,966 మంది ప్రాణాలు కోల్పోయారు. ప్రస్తుతం మొత్తం కేసుల్లో యాక్టివ్‌ కేసులు 0.03శాతం ఉన్నాయని, ప్రస్తుతం రికవరీ రేటు 98.76శాతానికి పెరిగిందని పేర్కొంది.

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)