దేశంలో రెండు రోజులపాటు తగ్గిన పాజిటివ్‌ కేసులు మళ్లీ 17 వేలు దాటాయి. ఆదివారం 11 వేల మందికి పాజిటివ్‌ రాగా, కొత్తగా మరో 17,073 మంది కరోనా బారిన పడ్డారు. ఇవి నిన్నటికంటే 45 శాతం అధికం కావడం విశేషం. దీంతో మొత్తం కేసులు 4,34,07,046కు చేరుకున్నాయి. ఇందులో 4,27,87,606 మంది బాధితులు డిశ్చార్జీ అయ్యారు. మరో 94,420 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. ఇప్పటివరకు 5,25,020 మంది కరోనాకు బలయ్యారు.కొత్తగా 21 మంది బాధితులు మృతిచెందారని కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది. 15,208 మంది బాధితులు వైరస్‌ నుంచి బయటపడ్డారని తెలిపింది. ఇక 2,49,646 మందికి వ్యాక్సినేషన్‌ చేశామని ప్రకటించింది. దీంతో ఇప్పటివరకు దేశవ్యాప్తంగా కరోనా టీకాల పంపిణీ 197.11 కోట్లకు చేరిందని పేర్కొన్నది. మొత్తం కేసుల్లో యాక్టివ్‌ కేసుల సంఖ్య 0.21 శాతానికి పెరిగిందని, రికవరీ రేటు 98.57 శాతం, మరణాల రేటు 1.21 శాతం, రోజువారీ పాజిటివిటీ రేటు 4.39 శాతానికి పెరిగిందని వెల్లడించింది.

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)