భారతదేశపు మొట్టమొదటి స్మాల్ శాటిలైట్ లాంచ్ వెహికల్ (SSLV) ప్రయోగం విజయవంతమైంది. అయితే మూడోదశలో ఉపగ్రహాలను నిర్దేశిత కక్ష్యలోకి ప్రవేశపెట్టింది. అయితే సాంకేతిక సమస్యలతో ఉపగ్రహాల నుంచి షార్కు సిగ్నల్స్ అందకపోవడంతో రాకెట్ ప్రయోగంపై సందిగ్ధత ఏర్పడింది. దీనిపై ఇస్రో చైర్మన్ ఎస్ సోమనాథ్ మాట్లాడుతూ.. 'ఎస్ఎస్ఎల్వి-డి1 అన్ని దశల్లోనూ ఆశించిన స్థాయిలోనే పనితీరు కనబరిచింది. మిషన్ చివరి దశలో కొంత డేటా నష్టం జరిగింది. మేము దానిని విశ్లేషిస్తున్నాము. ఈ SSLV భూమి పరిశీలన ఉపగ్రహాన్ని , విద్యార్థులు రూపొందించిన ఉపగ్రహాన్ని మోసుకెళ్తుంది. భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) ఈ విషయాన్ని వెల్లడించింది. 500 కిలోల బరువున్న ఉపగ్రహాలను 500 కి.మీ వరకు తక్కువ భూమి కక్ష్యలో చేర్చే మిషన్ను ఇస్రో ప్రారంభించింది. ఇది వేగంగా అభివృద్ధి చెందుతున్న SSLV మార్కెట్లో పెద్ద భాగం కావాలని లక్ష్యంగా పెట్టుకుంది.
SSLV-D1 performed as expected at all stages. In the terminal phase of the mission, some data loss is occurring. We are analysing the data to conclude the final outcome of the mission with respect to achieving a stable orbit: ISRO chairman S. Somanath pic.twitter.com/va2Womiro5
— ANI (@ANI) August 7, 2022
(ట్విట్టర్, ఇన్స్టాగ్రామ్ మరియు యూట్యూబ్తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)