Madhya Pradesh: అర్థరాత్రి ఘోర అగ్ని ప్రమాదం, బస్సులో ఒక్కసారిగా ఎగసిన మంటలు, తృటిలో తప్పించుకున్న 60 మంది ప్రయాణికులు, మధ్యప్రదేశ్లో ఘటన
మధ్యప్రదేశ్లోని బేతుల్ జిల్లాలో వేగంగా వెళ్తున్న బస్సుల్లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. అప్రమత్తమైన ప్రయాణికులు అగ్నిప్రమాదం నుంచి తమ ప్రాణాలను కాపాడుకున్నారు. మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్ నుంచి ఓ ప్రయివేటు బస్సు బుధవారం రాత్రి హైదరాబాద్కు బయల్దేరింది.
మధ్యప్రదేశ్లోని బేతుల్ జిల్లాలో వేగంగా వెళ్తున్న బస్సుల్లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. అప్రమత్తమైన ప్రయాణికులు అగ్నిప్రమాదం నుంచి తమ ప్రాణాలను కాపాడుకున్నారు. మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్ నుంచి ఓ ప్రయివేటు బస్సు బుధవారం రాత్రి హైదరాబాద్కు బయల్దేరింది. జాతీయ రహదారి 69పై బస్సు వేగంగా వెళ్తున్న సమయంలో ఇంజిన్లో మంటలు చెలరేగాయి. దీంతో డ్రైవర్ బస్సును నిలిపేశారు.
ప్రయాణికులంతా వేగంగా బస్సులో నుంచి కిందకు దిగారు. అగ్నిప్రమాదం సంభవించిన సమయంలో బస్సులో 60 మంది ప్రయాణికులు ఉన్నట్లు పోలీసులు తెలిపారు. అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేసింది. ఈ ప్రమాద ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ప్రయాణికులకు ఎలాంటి గాయాలు కాకపోవడంతో పోలీసులు ఊపిరి పీల్చుకున్నారు.
#Betul: 60 passengers escape unhurt after bus catches firehttps://t.co/YmFnTZPeqX
To get epaper daily on your whatsapp click here:
— Free Press Journal (@fpjindia) March 17, 2022
(SocialLY brings you all the latest breaking news, fact checks and information from social media world, including Twitter (X), Instagram and Youtube. The above post contains publicly available embedded media, directly from the user's social media account and the views appearing in the social media post do not reflect the opinions of LatestLY.)
(The above story first appeared on LatestLY on Mar 17, 2022 02:17 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

