Free Tea For Drivers: ఒడిశా ప్రభుత్వం సంచలన నిర్ణయం, రాత్రిపూట లారీ డ్రైవర్లకు ఉచిత ఛాయ్‌, నిద్రపోవడానికి లారీ టెర్మినల్స్‌

రాత్రిపూట రోడ్డు ప్రమాదాలు నివారించేందుకు ఒడిశా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.నిద్రలేమి, అలసిపోయి ఉన్న లారీ డ్రైవర్లకు ఉచితంగా టీ పంపిణీ చేయడం ద్వారా వారిలో నిద్రమత్తు వదిలించి ఉత్తేజ పరచాలని నిర్ణయించింది. హైవేల పక్కన ఉన్న దాబాలు, హోటళ్లలో లారీ డ్రైవర్లకు ఉచితంగా టీ అందించాలని ఒడిశా ప్రభుత్వం సూచించింది.

Free Tea For Drivers: ఒడిశా ప్రభుత్వం సంచలన నిర్ణయం, రాత్రిపూట లారీ డ్రైవర్లకు ఉచిత ఛాయ్‌, నిద్రపోవడానికి లారీ టెర్మినల్స్‌
Odisha government takes initiative of distributing free tea to drivers to mitigate road accidents

రాత్రిపూట రోడ్డు ప్రమాదాలు నివారించేందుకు ఒడిశా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.నిద్రలేమి, అలసిపోయి ఉన్న లారీ డ్రైవర్లకు ఉచితంగా టీ పంపిణీ చేయడం ద్వారా వారిలో నిద్రమత్తు వదిలించి ఉత్తేజ పరచాలని నిర్ణయించింది. హైవేల పక్కన ఉన్న దాబాలు, హోటళ్లలో లారీ డ్రైవర్లకు ఉచితంగా టీ అందించాలని ఒడిశా ప్రభుత్వం సూచించింది.

ఈ పథకం అమలులో భాగంగా తొలుత రోజూ రాత్రి 3 గంటల నుంచి తెల్లవారుజామున 6 గంటల వరకు ఫ్రీ ఛాయ్‌ ఇవ్వనున్నట్లు చెప్పింది. ఆ ఖర్చును రాష్ట్ర ప్రభుత్వమే భరిస్తుందని స్పష్టం చేసింది. లారీ డ్రైవర్లు టీ తాగిన తర్వాత కాసేపు విశ్రాంతి తీసుకునేలా కూడా హైవేల పక్కన ఏర్పాట్లు చేస్తున్నామని అధికారులు తెలిపారు. 30 జిల్లాల్లో లారీ టెర్మినల్స్‌ నిర్మిస్తున్నామని పేర్కొన్నారు. వాటిలో నిద్రపోవడానికి, స్నానాలు చేయడానికి సౌకర్యాలు ఉంటాయని చెప్పారు.

Here's News

(SocialLY brings you all the latest breaking news, fact checks and information from social media world, including Twitter (X), Instagram and Youtube. The above post contains publicly available embedded media, directly from the user's social media account and the views appearing in the social media post do not reflect the opinions of LatestLY.)

(The above story first appeared on LatestLY on Dec 22, 2023 02:56 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).