BJP All CMs Conclave: బీజేపీ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులతో ప్రధాని మోదీ సమావేశం, ఆయా రాష్ట్రాల్లో పరిస్థితులు, రాజకీయ పరిణామాల గురించి చర్చ
ఉత్తరప్రదేశ్లోని వారణాసి పట్టణంలో బీజేపీ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులతో ప్రధాని నరేంద్రమోదీ ఈ ఉదయం సమావేశమయ్యారు.
- Read in
- తెలుగు
Varanasi, December 14: ఉత్తరప్రదేశ్లోని వారణాసి పట్టణంలో బీజేపీ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులతో ప్రధాని నరేంద్రమోదీ ఈ ఉదయం సమావేశమయ్యారు. ఈ సమావేశానికి బీజేపీ జాతీయాధ్యక్షుడు జగత్ ప్రకాష్ నడ్డా, ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగీ ఆదిత్యనాథ్, హర్యానా ముఖ్యమంత్రి మనోహర్లాల్ కట్టర్, ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి పుష్కర్సింగ్ ధామి, అసోం ముఖ్యమంత్రి హిమాంత బిశ్వశర్మ, కర్ణాటక ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై సహా బీజేపీ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులందరూ హాజరయ్యారు.
ఈ సందర్భంగా ఆయా రాష్ట్రాల్లో పరిస్థితులు, రాజకీయ పరిణామాల గురించి ప్రధాని ముఖ్యమంత్రులను అడిగి తెలుసుకున్నారు. పలు సంక్షేమ పథకాల అమలుతీరు, ప్రజల్లో స్పందన గురించి ఆరా తీశారు. కేంద్ర ప్రభుత్వ సంక్షేమ పథకాల అమలు గురించి పలు సలహాలు, సూచనలు ఇచ్చారు. ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్ అసెంబ్లీ ఎన్నికల అంశం కూడా ఈ సమావేశంలో చర్చకు వచ్చినట్లు సమాచారం.
#WATCH | PM Narendra Modi chairs a meeting of the Chief Ministers of BJP-ruled states in Varanasi, Uttar Pradesh pic.twitter.com/kQ1qjVtbzk
— ANI UP (@ANINewsUP) December 14, 2021
(SocialLY brings you all the latest breaking news, fact checks and information from social media world, including Twitter (X), Instagram and Youtube. The above post contains publicly available embedded media, directly from the user's social media account and the views appearing in the social media post do not reflect the opinions of LatestLY.)
(The above story first appeared on LatestLY on Dec 14, 2021 12:12 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

