ఉత్త‌ర‌ప్ర‌దేశ్ సోన్‌భంద్రా జిల్లాలోని బ్ర‌హ్మ‌న‌గ‌ర్ ఏరియాలో ఓ పెళ్లి వేడుక‌లో విషాద‌ఛాయ‌లు అలుముకున్నాయి. బ‌రాత్ వేడుక‌లో భాగంగా ఊరేగింపుగా వెళ్తున్న‌ పెళ్లికుమారుడు గాల్లోకి కాల్పులు జ‌రిపాడు. ప్ర‌మాద‌వ‌శాత్తు ఆ బుల్లెట్ స్నేహితుడికి త‌గిలింది. దీంతో అత‌ను ప్రాణాలు కోల్పోయాడు. మ‌నీష్ మాద్హేశియా అనే పెళ్లి కుమారుడు త‌న కుటుంబ స‌భ్యులు, స్నేహితుల‌తో క‌లిసి బ‌రాత్ వేడుక‌లో భాగంగా ఊరేగింపుగా వెళ్తున్నాడు. ఈ స‌మ‌యంలో మ‌నీష్ గాల్లోకి కాల్పులు జ‌రిపాడు. ఆ బుల్లెట్ పెళ్లికుమారుడు స్నేహితుడు బాబు లాల్ యాద‌వ్‌కు త‌గిలింది. దీంతో అత‌న్ని చికిత్స నిమిత్తం ఆస్ప‌త్రికి త‌ర‌లించ‌గా, చికిత్స పొందుతూ యాద‌వ్ ప్రాణాలు కోల్పోయాడు. వ‌రుడు ఉప‌యోగించిన తుపాకీ కూడా యాద‌వ్‌దే. ఈ ఘ‌ట‌న‌పై పోలీసులు ఎఫ్ఐఆర్ న‌మోదు చేసి ద‌ర్యాప్తు చేప‌ట్టారు. వ‌రుడిని అదుపులోకి తీసుకున్నారు. తుపాకీని కూడా పోలీసులు సీజ్ చేశారు.

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)