Uttarakhand Floods: కేదార్నాథ్ యాత్ర మార్గంలో విరిగిపడిన కొండ చరియలు, 12 మంది గల్లంతు, హుటాహుటిన సహాయక చర్యలు ప్రారంభించిన అధికారులు
దేవ భూమి ఉత్తరాఖండ్ కేదార్నాథ్ యాత్ర మార్గంలో కొండచరియ విరిగిపడటంతో పెను ప్రమాదం సంభవించింది. రుద్ర ప్రయాగ్ జిల్లా, గౌరీ కుండ్ సమీపంలో ఈ కొండచరియ క్రింద దాదాపు 12 మంది చిక్కుకున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. ఈ మార్గంలోని దుకాణాలు ధ్వంసమయ్యాయి
దేవ భూమి ఉత్తరాఖండ్ కేదార్నాథ్ యాత్ర మార్గంలో కొండచరియ విరిగిపడటంతో పెను ప్రమాదం సంభవించింది. రుద్ర ప్రయాగ్ జిల్లా, గౌరీ కుండ్ సమీపంలో ఈ కొండచరియ క్రింద దాదాపు 12 మంది చిక్కుకున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. ఈ మార్గంలోని దుకాణాలు ధ్వంసమయ్యాయి. రాష్ట్ర విపత్తు స్పందన దళం హుటాహుటిన చేరుకుని, సహాయ కార్యక్రమాలను ప్రారంభించింది.
వీరిలో కొందరు కొట్టుకుపోయి ఉండవచ్చునని కూడా తెలిపారు. గురువారం రాత్రి భారీ వర్షాలు కురియడంతో ఈ కొండచరియ విరిగిపడిందని తెలిపారు. మూడు దుకాణాలు ధ్వంసమయ్యాయని రుద్రప్రయాగ్ జిల్లా విపత్తు నిర్వహణ అధికారి తెలిపారు. తప్పిపోయినవారిని గుర్తించేందుకు గాలింపు చర్యలు ప్రారంభమయ్యాయని జిల్లా ఎస్పీ డాక్టర్ విశాఖ తెలిపారు. డిజాస్టర్ మేనేజ్మెంట్ ఆఫీసర్ దలీప్ సింగ్ రాజ్వర్ మాట్లాడుతూ, భారీ వర్షాలు, రాళ్లు విరిగిపడటం వల్ల మూడు దుకాణాలు ధ్వంసమైనట్లు తమకు సమాచారం వచ్చిందన్నారు.

Here's Videos
raining heavily since last night. Around 13 Nepali labourers missing after a shop hit by a boulder was damaged at Gaurikund, en route Kedarnath. Amid rains, rescue teams are searching for survivors #Uttarakhand #Kedarnath #rain pic.twitter.com/tBpGy6AFgR
— Preeti Sompura (@sompura_preeti) August 4, 2023
(SocialLY brings you all the latest breaking news, fact checks and information from social media world, including Twitter (X), Instagram and Youtube. The above post contains publicly available embedded media, directly from the user's social media account and the views appearing in the social media post do not reflect the opinions of LatestLY.)
(The above story first appeared on LatestLY on Aug 04, 2023 11:29 AM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

