Election Commission Exit Polls: ఏప్రిల్ 19 ఉదయం 7 నుంచి జూన్ 1న సాయంత్రం 6.30 గంటల వరకు ఎగ్జిట్ పోల్స్ బ్యాన్.. కీలక నోటిఫికేషన్ జారీ చేసిన ఎన్నికల సంఘం
కేంద్ర ఎన్నికల సంఘం (ఈసీ) కీలక ప్రకటన విడుదల చేసింది. లోక్ సభ ఎన్నికలు2024లో ప్రారంభ దశ ఏప్రిల్ 19 ఉదయం 7 గంటల నుంచి ఏడవ దశ పోలింగ్ జరగాల్సిన జూన్ 1న సాయంత్రం 6.30 గంటల వరకు ఎగ్జిట్ పోల్స్ ఇవ్వడానికి వీల్లేదని సూచించింది.
Newdelhi, Mar 30: కేంద్ర ఎన్నికల సంఘం (ఈసీ) (Election Commission) కీలక ప్రకటన విడుదల చేసింది. లోక్ సభ ఎన్నికలు (Loksabha Elections) 2024లో ప్రారంభ దశ ఏప్రిల్ 19 ఉదయం 7 గంటల నుంచి ఏడవ దశ పోలింగ్ జరగాల్సిన జూన్ 1న సాయంత్రం 6.30 గంటల వరకు ఎగ్జిట్ పోల్స్ ఇవ్వడానికి వీల్లేదని సూచించింది. లోక్ సభ, 4 రాష్ట్రాల అసెంబ్లీ, ఉపఎన్నికలకు ఓటింగ్ పూర్తయ్యే వరకు ఎగ్జిట్ పోల్స్ (Exit Polls) నిర్వహించడం, ప్రచురించడం నిషిద్ధమని హెచ్చరిస్తూ నోటిఫికేషన్ జారీ చేసింది. ప్రజాప్రాతినిధ్య చట్టంలోని నిబంధనల ప్రకారం పోలింగ్ సమయంలో ఒపీనియన్ పోల్, పోల్ సర్వే ఫలితాలను ప్రచురించడం కూడా నిషేధించినట్టు గుర్తుచేసింది.
The #ElectionCommission has issued a notification banning the conduct, publication or publicising of exit polls between 7.00 am of April 19 and 6.30 pm of June 1
Read to know more 👇https://t.co/NH6JCiRBSE#LokSabhaElections2024 #ExitPolls #ECI
— Moneycontrol (@moneycontrolcom) March 29, 2024
(SocialLY brings you all the latest breaking news, fact checks and information from social media world, including Twitter (X), Instagram and Youtube. The above post contains publicly available embedded media, directly from the user's social media account and the views appearing in the social media post do not reflect the opinions of LatestLY.)
(The above story first appeared on LatestLY on Mar 30, 2024 08:29 AM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

