ఢిల్లీ మునిసిపల్ (ఎంసీడీ) ఎన్నికల ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. ఈ నెల 4న జరిగిన ఎన్నికల్లో 50 శాతానికి పైగా ఓటింగ్ నమోదైంది. మొత్తం 250 వార్డుల్లోని 1,349 స్థానాలకు ఎన్నికలు జరిగాయి. తాజాగా వెల్లడవుతున్న ఫలితాల్లో బీజేపీ 97 స్థానాల్లో ఘన విజయం సాధించింది. ఆప్ 126 సీట్లలో విజయం సాధించింది. కాంగ్రెస్ పార్టీ 7 స్థానాలు గెలుచుకుంది. ప్రస్తుతం బీజేపీ 6 సీట్లలో లీడ్ లో ఉండగా ఆమ్ ఆద్మీ 8 సీట్లలో లీడ్ లో ఉంది. కాంగ్రెస్ 3 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది. ఇండిపెండెంట్లు మూడు సీట్లు గెలుచుకున్నారు. కౌంటింగ్ జరుగుతోంది. 2017లో జరిగిన ఎన్నికల్లో అప్పట్లో ఉన్న 270 స్థానాలకు గాను 181 స్థానాల్లో బీజేపీ విజయం సాధించింది.

Here's ANI Tweet

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)