Presidential Elections 2022: విపక్షాల రాష్ట్రపతి అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేసిన యశ్వంత్ సిన్హా, కార్యక్రమానికి హాజరయిన పలు పార్టీల నేతలు
విపక్షాల రాష్ట్రపతి అభ్యర్థి యశ్వంత్ సిన్హా తన నామినేషన్ను సోమవారం దాఖలు చేశారు. ఈ కార్యక్రమానికి టీఆర్ఎస్ పార్టీ తరపున ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, నామా నాగేశ్వరరావు తదితరులు హాజరయ్యారు. అయితే నామినేషన్ దాఖలు సమయంలో కేటీఆర్ ముందు వరుసలో కూర్చున్నారు.
విపక్షాల రాష్ట్రపతి అభ్యర్థి యశ్వంత్ సిన్హా తన నామినేషన్ను సోమవారం దాఖలు చేశారు. ఈ కార్యక్రమానికి టీఆర్ఎస్ పార్టీ తరపున ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హాజరయ్యారు. అయితే నామినేషన్ దాఖలు సమయంలో కేటీఆర్ ముందు వరుసలో కూర్చున్నారు. మల్లికార్జున్ ఖర్గే, రాహుల్ గాంధీ, శరద్ పవార్, అఖిలేష్ యాదవ్, కేటీఆర్, ఏ రాజా, సీతారాం ఏచూరి ముందు వరుసలో ఆశీనులై.. రాష్ట్రపతి అభ్యర్థి యశ్వంత్ సిన్హాకు తమ మద్దతును తెలిపారు.
విపక్షాల రాష్ట్రపతి అభ్యర్థి యశ్వంత్ సిన్హాకు పూర్తిస్థాయి మద్దతు ఇవ్వాలని టీఆర్ఎస్ అధినేత కే చంద్రశేఖర్ రావు నిర్ణయించినట్లు ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ట్విట్టర్ వేదికగా ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో యశ్వంత్ సిన్హా నామినేషన్ కార్యక్రమంలో టీఆర్ఎస్ పార్టీ తరపున తనతో పాటు తమ ఎంపీలు హాజరవుతున్నట్లు కేటీఆర్ వెల్లడించారు. యశ్వంత్ సిన్హా నామినేషన్ దాఖలు కంటే ముందు కేటీఆర్ ఈ ట్వీట్ చేశారు.
Opposition's Presidential polls candidate Yashwant Sinha files nomination
Read @ANI Story | https://t.co/B6KPmJFKNi
#PresidentialElection #YashwantSinha #Nomination pic.twitter.com/RWbjEBrxXY
— ANI Digital (@ani_digital) June 27, 2022
(SocialLY brings you all the latest breaking news, fact checks and information from social media world, including Twitter (X), Instagram and Youtube. The above post contains publicly available embedded media, directly from the user's social media account and the views appearing in the social media post do not reflect the opinions of LatestLY.)
(The above story first appeared on LatestLY on Jun 27, 2022 01:15 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

