CM YS Jagan Sri Rama Navami Wishes: రాష్ట్ర ప్రజలకు శ్రీరామనవమి శుభాకాంక్షలు తెలిపిన ఏపీ సీఎం వైయస్ జగన్, కోవిడ్‌ నిబంధనలు పాటిస్తూ సీతారాముల కళ్యాణాన్నివేడుకగా జరుపుకోవాలని సూచన

శ్రీరామ నవమి పర్వదినం సందర్భంగా ఆంద్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి ప్రజలందరికి నవమి శుభాకాంక్షలు (CM YS Jagan Sri Rama Navami Wishes) తెలియజేశారు. ప్రజలు కోవిడ్‌ నిబంధనలు పాటిస్తూ.. సీతారాముల కళ్యాణాన్ని ప్రజలు వేడుకగా జరుపుకోవాలని ఆకాంక్షించారు.

CM YS Jagan Sri Rama Navami Wishes: రాష్ట్ర ప్రజలకు శ్రీరామనవమి శుభాకాంక్షలు తెలిపిన ఏపీ సీఎం వైయస్ జగన్, కోవిడ్‌ నిబంధనలు పాటిస్తూ సీతారాముల కళ్యాణాన్నివేడుకగా జరుపుకోవాలని సూచన
AP Assembly session cm-jagan-sensational-comments-ap-capital(Photo-Twitter)

సీతారాముల, దీవెనలతో రాష్ట్ర ప్రజలందరికీ సకల శుభాలు కలగాలని సీఎం వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి అభిలషించారు. కరోనా విపత్తును ఎదుర్కొనే శక్తి ఇవ్వాలని ఆ దేవుడిని ప్రార్థిస్తున్నానని వైఎస్‌ జగన్‌ అన్నారు.

ట్విట్టర్ లో సత్యం, ధర్మం, న్యాయమే మార్గాలుగా సర్వమానవ సంక్షేమ పాలన సాగించిన పరమ పావనమూర్తి శ్రీరామచంద్రుడు. కష్టనష్టాల్లోనూ ఒకే మాట ఒకే బాటగా సాగిన జగదభిరాముడు మనకు ఆదర్శప్రాయుడు. పుణ్య దంపతులు సీతారాముల కళ్యాణం ఈ లోకానికి పండుగ రోజు. రాష్ట్ర ప్రజలకు శ్రీరామ నవమి శుభాకాంక్షలు. అంటూ ట్వీట్ చేశారు.

(SocialLY brings you all the latest breaking news, fact checks and information from social media world, including Twitter (X), Instagram and Youtube. The above post contains publicly available embedded media, directly from the user's social media account and the views appearing in the social media post do not reflect the opinions of LatestLY.)

(The above story first appeared on LatestLY on Apr 21, 2021 11:16 AM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).