Miss World 2021 Postponed: మిస్ వరల్డ్ 2021 పోటీలు వాయిదా, మానస వారణాసితో పాటు మొత్తం 17 మందికి కరోనా, పోటీదారులంతా పోర్టారికోలోనే ఐసోలేషన్లో..
మిస్ వరల్డ్ పోటీలకు కరోనా మహమ్మారి సెగ తగిలింది. మిస్ ఇండియా వరల్డ్ మానస వారణాసితో పాటు మొత్తం 17 మంది పోటీదారులు, సిబ్బందికి కరోనా పాజిటివ్ రావడంతో మిస్ వరల్డ్-2021 పోటీలు తాత్కాలికంగా వాయిదాపడ్డాయి.
- Read in
- తెలుగు
మిస్ వరల్డ్ పోటీలకు కరోనా మహమ్మారి సెగ తగిలింది. మిస్ ఇండియా వరల్డ్ మానస వారణాసితో పాటు మొత్తం 17 మంది పోటీదారులు, సిబ్బందికి కరోనా పాజిటివ్ రావడంతో మిస్ వరల్డ్-2021 పోటీలు తాత్కాలికంగా వాయిదాపడ్డాయి. పోటీల నిర్వాహకులు గురువారం నాడు ఈవెంట్ ప్రారంభానికి కేవలం కొన్ని గంటల ముందు ఈ మేరకు ప్రకటన చేశారు. ప్రస్తుతం పోటీదారులంతా మిస్ వరల్డ్ ఫినాలే జరగాల్సిన పోర్టారికోలోనే ఐసోలేషన్లో ఉన్నారు. కంటెస్టెంట్లలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతున్న దృష్ట్యా మిస్ వరల్డ్ ఆర్గనైజేషన్ ప్రపంచ సుందరి పోటీలను తాత్కాలికంగా వాయిదా వేయాలని నిర్ణయించాం అని అధికారిక ప్రకటనలో పేర్కొన్నారు. రాబోయే 90 రోజుల్లో పోర్టారికో కొలీజియం జోస్ మిగ్వెల్ అగ్రెలాట్ ప్రపంచ సుందరి ఫినాలే పోటీలు ఎప్పుడనేది రీషెడ్యూల్ చేస్తుందని వెల్లడించారు.
BREAKING: The Miss World organization postpones its coronation on Friday, Dec. 17, to ensure the safety of contestants and staff after confirming additional COVID-19 cases. The finale will be rescheduled within 90 days. pic.twitter.com/7xQRAKefCT
— CNN Philippines (@cnnphilippines) December 16, 2021
(SocialLY brings you all the latest breaking news, fact checks and information from social media world, including Twitter (X), Instagram and Youtube. The above post contains publicly available embedded media, directly from the user's social media account and the views appearing in the social media post do not reflect the opinions of LatestLY.)
(The above story first appeared on LatestLY on Dec 17, 2021 01:38 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

