Scorpion Festival: కర్నూలు జిల్లాలో ఘనంగా తేళ్ల పండగ వేడుక, తేళ్లతో దేవుడికి నైవేద్యం సమర్పించిన భక్తులు, వీడియో ఇదిగో..
ఆంధ్రప్రదేశ్లోని కర్నూలు జిల్లా కోడుమూరు పట్టణంలో జరిగిన తేలు పండుగ వేడుకలు ఘనంగా జరిగాయి. పండగలోకి వెళితే..ఈ గ్రామ ప్రజలు తేలు కనిపిస్తే అదృష్టంగా భావిస్తారు. అంతేకాదు దాన్ని చేతిలో పట్టుకుని దేవుడికి నైవేద్యంగా సమర్సిస్తారు. ఇది వారి ఆచారం.
ఆంధ్రప్రదేశ్లోని కర్నూలు జిల్లా కోడుమూరు పట్టణంలో జరిగిన తేలు పండుగ వేడుకలు ఘనంగా జరిగాయి. పండగలోకి వెళితే..ఈ గ్రామ ప్రజలు తేలు కనిపిస్తే అదృష్టంగా భావిస్తారు. అంతేకాదు దాన్ని చేతిలో పట్టుకుని దేవుడికి నైవేద్యంగా సమర్సిస్తారు. ఇది వారి ఆచారం. అవి కుట్టినా గుడి చెట్టు మూడు ప్రదక్షిణలు చేస్తే నొప్పి మటుమాయం అవుతుందని వారి నమ్మకం.
కర్నూలు జిల్లా కోడుమూరులో కొండపై కొండలరాయుడి ఆలయం ఉంది. ఇక్కడి స్వామిని వేంకటేశ్వరుడి ప్రతిరూపంగా భావించి కొలుస్తారు. ఏటా శ్రావణ మాసం మూడో సోమవారం ఇక్కడ విశేష పూజలు జరుగుతాయి. ఆ రోజు కొండపై ఏ రాయి కదిపినా తేల్లు ప్రత్యక్షమవుతాయి. అక్కడ భక్తులు ముందుగా తేళ్ల కోసం వేట కొనసాగిస్తారు. అవి దొరికితే దానికి దారం కట్టి స్వామికి నైవేద్యంగా సమర్పించి పూజిస్తారు.

Here's Video
Visuals of Scorpion Festival celebrations at Kodumur town of Andhra Pradesh's Kurnool district. pic.twitter.com/Vq5TJvcZKZ
— Press Trust of India (@PTI_News) September 7, 2023
(SocialLY brings you all the latest breaking news, fact checks and information from social media world, including Twitter (X), Instagram and Youtube. The above post contains publicly available embedded media, directly from the user's social media account and the views appearing in the social media post do not reflect the opinions of LatestLY.)
(The above story first appeared on LatestLY on Sep 07, 2023 11:07 AM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

