అసోం బీజేపీకి చెందిన ఓ ఎమ్మెల్యే చేసిన ప‌నిని సోష‌ల్ మీడియా వేదిక‌గా ప్ర‌జ‌లు ఛీత్క‌రించుకుంటున్నారు. బీజేపీకి చెందిన సిబు మిశ్రా అనే ఎమ్మెల్యే వరదల ప్రభావిత గ్రామాల్లో ప‌ర్య‌టించ‌డానికి సిద్ధ‌ప‌డ్డారు. ఓ చోట విప‌రీత‌మైన నీరు ఉండ‌టంతో అక్క‌డే ఉన్న రెస్క్యూ టీమ్ స‌భ్యుడి వీపుపై ఎక్కి, ఎమ్మెల్యే ప‌డ‌వ వ‌ర‌కూ వెళ్లారు. ఇప్పుడు ఇదే వీడియో సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతోంది. అయితే.. ఈ ప్రాంతంలో పెద్ద నీళ్లేమీ లేవు. క‌నీసం మోకాల్లోతు అంత నీరు కూడా లేదు. అయినా స‌రే.. రెస్క్యూ టీమ్ స‌భ్యుడి వీపుపై ఎక్కి, ప‌డ‌వ వ‌ర‌కూ వెళ్ల‌డం ఏంట‌ని నెటిజ‌న్స్ మండిప‌డుతున్నారు.

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)