Uttar pradesh: షాకింగ్ వీడియో..కరోనాతో చనిపోయిన మృతదేహాన్ని బ్రిడ్జిపై నుంచి నదిలో పడేసిన ఓ వ్యక్తి, యూపీలో బ్రిడ్జిపై నుంచి వెళ్తున్న వ్యక్తులు తీసిన వీడియో వైరల్, వారిపై చర్యలు తీసుకుంటామని తెలిపిన పోలీసులు
పీపీఈ కిట్ వేసుకున్న ఓ వ్యక్తి కరోనాతో చనిపోయిన మృతదేహాన్ని బ్రిడ్జిపై నుంచి నదిలోకి పడేస్తున్న వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఇప్పటికే ఆ రాష్ట్రంలో గంగ, యమున నదుల్లో వందల సంఖ్యలో శవాలు తేలుతూ కనిపిస్తున్న తరుణంలో ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాని షేక్ చేస్తోంది.
పీపీఈ కిట్ వేసుకున్న ఓ వ్యక్తి కరోనాతో చనిపోయిన మృతదేహాన్ని బ్రిడ్జిపై నుంచి నదిలోకి పడేస్తున్న వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఇప్పటికే ఆ రాష్ట్రంలో గంగ, యమున నదుల్లో వందల సంఖ్యలో శవాలు తేలుతూ కనిపిస్తున్న తరుణంలో ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాని షేక్ చేస్తోంది. వర్షం పడుతుండగా పట్టపగలు, బ్రిడ్డిపై వాహనాలు తిరుగుతున్న సమయంలోనే ఆ వ్యక్తి మరొకరి సాయంతో ఇలా మృతదేహాన్ని నదిలోకి పడేయడం షాక్ లాంటిదే. ఈ నెల 28న జరిగిన ఈ ఘటనను ఆ సమయంలో బ్రిడ్జిపై నుంచి వెళ్తున్న వ్యక్తులు వీడియో తీశారు. అది కొవిడ్ పేషెంట్ మృతదేహమేనని బల్రామ్పూర్ చీఫ్ మెడికల్ ఆఫీసర్ బీబీ సింగ్ చెప్పారు. ఇప్పటికే బంధువులపై కేసు నమోదు చేశారు. వాళ్లపై కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన స్పష్టం చేశారు.
#India | A man in a PPE suit was caught on camera throwing a body into Rapti river in #UttarPradesh.
The body was of a Covid positive patient who lost his life on May 28. pic.twitter.com/P49GzBZv5j
— Munir A Hussein (@Munir566) May 30, 2021
(SocialLY brings you all the latest breaking news, fact checks and information from social media world, including Twitter (X), Instagram and Youtube. The above post contains publicly available embedded media, directly from the user's social media account and the views appearing in the social media post do not reflect the opinions of LatestLY.)
(The above story first appeared on LatestLY on May 30, 2021 07:44 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

