WHO on Corona Cases: ఎక్స్ బీబీతో పాటూ జేఎన్.1 లాంటి వేరియంట్ ల కారణంగా మళ్లీ కరోనా కేసుల పెరుగుదల.. డబ్ల్యూహెచ్ఓ వెల్లడి.. ప్రస్తుతం దేశంలో 1,701కు చేరిన యాక్టివ్ కేసులు
అనేక దేశాల్లో కరోనా కేసులు వెలుగు చూస్తున్న నేపథ్యంలో డబ్ల్యూహెచ్ఓ కీలక సూచనలు చేసింది. వ్యాధి వ్యాప్తి తీరును జాగ్రత్తగా పరిశీలించాలని, వైరస్ జీనోమ్ సీక్వెన్సింగ్ సమాచారం ఎప్పటికప్పుడు పంచుకోవాలని పేర్కొంది.
Newdelhi, Dec 18: అనేక దేశాల్లో కరోనా కేసులు (Corona Cases) వెలుగు చూస్తున్న నేపథ్యంలో డబ్ల్యూహెచ్ఓ (WHO) కీలక సూచనలు చేసింది. వ్యాధి వ్యాప్తి తీరును జాగ్రత్తగా పరిశీలించాలని, వైరస్ (Virus) జీనోమ్ సీక్వెన్సింగ్ సమాచారం ఎప్పటికప్పుడు పంచుకోవాలని పేర్కొంది. ప్రస్తుతం 68 శాతం కేసులకు కరోనా ఎక్స్ బీబీ వేరియంట్ కుటుంబానికి చెందిన వైరస్లు, జేఎన్.1 లాంటి సబ్ వేరియంట్లు కారణమని వెల్లడించింది. ఇక, భారత్ లో మళ్లీ కరోనా కలకలం మొదలైంది. ఆదివారం దేశవ్యాప్తంగా 335 కొత్త కరోనా కేసులు వెలుగులోకి వచ్చాయి. మరో ఐదుగురు కరోనాతో మరణించారు. ప్రస్తుతం యాక్టివ్ కేసుల సంఖ్య 1,701గా ఉందని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ తాజాగా వెల్లడించింది. మృతుల్లో నలుగురు కేరళ వాసులు కాగా ఉత్తరప్రదేశ్లో ఓ వ్యక్తి కరోనాతో కన్నుమూశారు.
WHO Encourages Nations to Maintain Vigilant Surveillance as Covid Cases Surge#COVID19 #Corona #WHO #CovidIsntOver #Covid @WHO https://t.co/ut2WzMct3v
— Northeast Rising (@ne_rising) December 18, 2023
(SocialLY brings you all the latest breaking news, fact checks and information from social media world, including Twitter (X), Instagram and Youtube. The above post contains publicly available embedded media, directly from the user's social media account and the views appearing in the social media post do not reflect the opinions of LatestLY.)
(The above story first appeared on LatestLY on Dec 18, 2023 10:15 AM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

