శ్రీలంక‌తో మొహాలీలో జ‌రుగుతున్న తొలి టెస్టులో విరాట్ కోహ్లీ క్లీన్ బౌల్డ్ అయ్యాడు. 100వ టెస్టు ఆడుతున్న కోహ్లీ 45 ప‌రుగులు వ్య‌క్తిగ‌త స్కోర్ వ‌ద్ద అత‌ను ఎబుల్దెనియా బౌలింగ్‌లో ఔట‌య్యాడు. ఆఫ్ స్టంప్‌పై ప‌డ్డ బంతి నేరుగా వికెట్‌ను తాకింది. ఈ టెస్టు ద్వారా టెస్టుల్లో 8 వేల ప‌రుగుల మైలురాయిని దాటేశాడు. ఈ ఫీట్‌ను అందుకున్న ఆర‌వ భార‌తీయ క్రికెట‌ర్‌గా నిలిచాడ‌త‌ను. ఇండియా 45 ఓవ‌ర్ల‌లో మూడు వికెట్ల న‌ష్టానికి 173 ర‌న్స్ చేసింది. విహారీ 57, పంత్ ఒక ప‌రుగు చేసి క్రీజ్‌లో ఉన్నారు.

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)