న్యూజిలాండ్‌తో జరిగిన మొదటి వన్డేలో టీమిండియా పరాజయవ పాలైంది. కివీస్‌ చేతిలో ఏడు వికెట్ల తేడాతో ధావన్‌ సేన ఓటమిని మూటగట్టుకుంది. బ్యాటర్లు రాణించినప్పటికీ బౌలర్లు విఫలం కావడంతో భారత జట్టుకు పరాజయం తప్పలేదు. ఇక ఈ విజయంతో విలియమ్సన్‌ బృందం మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో 1-0తో ముందంజలో నిలిచింది. కీల‌క ఇన్నింగ్స్ ఆడిన కెప్టెన్ విలియ‌మ్స‌న్ 94 ర‌న్స్‌తో నాటౌట్‌గా నిలిచాడు. లాథ‌మ్(145 నాటౌట్‌) ఇన్నింగ్స్‌లో 19 ఫోర్లు అయిదు సిక్స‌ర్లు ఉన్నాయి.నాలుగో వికెట్‌కు లాథ‌మ్‌, విలియ‌మ్స‌న్ అజేయంగా 221 ప‌రుగుల భాగ‌స్వామ్యం నెల‌కొల్పారు.

మొదటి వన్డే- మ్యాచ్‌ స్కోర్లు:

ఇండియా- 306/7 (50)

న్యూజిలాండ్‌- 309/3 (47.1)

Here's ICC Tweet

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)