ఏపీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిపై జరిగిన హత్యాయత్నం కేసు దర్యాప్తును పోలీసులు వేగవంతం వేశారు. ఈ క్రమంలో దాడికి సంబంధించి నిందితుల వివరాల చెప్పిన వారికి ఎన్టీఆర్‌ జిల్లా పోలీసులు నగదు బహుమతిని ప్రకటించారు. దాడిపై సమాచారం ఇచ్చిన వారికి రూ.2లక్షలు నగదు బహుమతి ఇవ్వనున్నట్టు పోలీసులు తెలిపారు. వారి వివరాలను ఈ కింది నంబర్లకు సమాచారం ఇవ్వాలని సూచించారు. వివరాల తెలిపిన వారి పేపర్లను గోప్యంగా ఉంచుతామని పోలీసులు హామీ ఇచ్చారు. సీఎం జగన్‌పై గుర్తు తెలియని వ్యక్తి/వ్యక్తులు గురించి ఏదైనా సమాచారం ఉన్నా, తెలిసినా తమకు తెలపాలని ఎన్టీఆర్‌ జిల్లా పోలీసులు కోరారు. ఈ సందర్భంగా సీఎం జగన్‌పై దాడికి సంబంధించి కచ్చితమైన సమాచారం ఇచ్చిన వారిని నగదు బహుమతి ఇస్తామని స్పష్టం చేశారు.

Here's News

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)