వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ హయాంలో ఆంధ్రప్రదేశ్‌లో జరిగిందని ఆరోపిస్తున్న లిక్కర్‌ స్కామ్‌పై విచారణ జరపాలని అనకాపల్లి బీజేపీ ఎంపీ సీఎం రమేశ్‌ (CM Ramesh) డిమాండ్‌ చేశారు. పార్లమెంట్ సమావేశాల్లో (Parliament Budget Session) మద్యం అంశంపై లోక్‌సభ (Lok Sabha) జీరో అవర్‌లో సీఎం రమేశ్‌ ప్రస్తావించారు. వైసీపీ హయాంలో దిల్లీని మించిన లిక్కర్‌ స్కామ్‌ జరిగిందని ఆయన ఆరోపించారు. ఢిల్లీ లిక్కర్‌ స్కామ్‌తో పోలిస్తే జగన్‌ స్కామ్‌ పదిరెట్లు (AP liquor scam overshadows Delhi liquor scam) పెద్దదన్నారు.

వీడియో ఇదిగో, నా ప్రయాణం కడదాకా జగన్‌తోనే, పార్టీ మార్పు వ్యాఖ్యలపై స్పందించిన మంత్రాలయం వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే బాలనాగిరెడ్డి

2019, 2024 మధ్య, ఆంధ్రప్రదేశ్‌లో మద్యం పంపిణీ వ్యవస్థలో మార్పులు జరిగాయని, మద్యం ప్రభుత్వ నిర్వహణ దుకాణాల ద్వారా మాత్రమే విక్రయించబడిందని ఆయన ఎత్తి చూపారు. ఐదు సంవత్సరాలలో, మద్యం వ్యాపారం రూ. లక్ష కోట్లకు పైగా టర్నోవర్‌ను సృష్టించిందని, లావాదేవీలు పూర్తిగా నగదు రూపంలో జరిగాయని ఆయన ఎత్తి చూపారు. అదనంగా, మద్యం దుకాణాల సిబ్బందిని కాంట్రాక్ట్ ప్రాతిపదికన నియమించారన్నారు. రమేష్ దీనిని రూ.2,500 కోట్ల ఢిల్లీ మద్యం కుంభకోణంతో పోల్చారు, ఏపీ కుంభకోణం స్థాయి చాలా పెద్దదని, తక్షణ దర్యాప్తు అవసరమని నొక్కి చెప్పారు.

సీఎం రమేశ్ మాట్లాడుతుండగా మధ్యలో వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి జోక్యం చేసుకున్నారు. సీఎం రమేశ్ బీజేపీ కోసం పనిచేయడం లేదని టీడీపీకి పనిచేస్తున్నారని విమర్శలు గుప్పించారు. ఏపీలో మార్గదర్శి స్కామ్ చాలా పెద్ద కుంభకోణమని మిథున్ రెడ్డి తెలిపారు.

AP liquor scam overshadows Delhi liquor scam: Anakapalli BJP MP C.M. Ramesh

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)