Pawan Kalyan Meets JP Nadda: బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాను కలిసిన పవన్ కళ్యాణ్, ఏపీలో తాజా రాజకీయ పరిస్థితులపై చర్చలు
ఢిల్లీ పర్యటనలో ఉన్న జనసేన అధినేత పవన్ కల్యాణ్.. బుధవారం కేంద్ర మంత్రులు అమిత్షా, మురళీధరన్తో భేటీ అయ్యారు.ఈ రోజు బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాను కలిశారు. వీరిద్దరి భేటీ సుమారు గంటకు పైగా సాగింది. ఏపీలో తాజా రాజకీయ పరిస్థితులు, బీజేపీ రాష్ట్ర సారథి మార్పు తర్వాతి పరిణామాలు, ఎన్నికలకు సమాయత్తం తదితరాలపై నడ్డా, పవన్ చర్చించినట్లు సమాచారం.
ఢిల్లీ పర్యటనలో ఉన్న జనసేన అధినేత పవన్ కల్యాణ్.. బుధవారం కేంద్ర మంత్రులు అమిత్షా, మురళీధరన్తో భేటీ అయ్యారు.ఈ రోజు బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాను కలిశారు. వీరిద్దరి భేటీ సుమారు గంటకు పైగా సాగింది. ఏపీలో తాజా రాజకీయ పరిస్థితులు, బీజేపీ రాష్ట్ర సారథి మార్పు తర్వాతి పరిణామాలు, ఎన్నికలకు సమాయత్తం తదితరాలపై నడ్డా, పవన్ చర్చించినట్లు సమాచారం. రాష్ట్రంలో శాంతి భద్రతల పరిస్థితుల అంశాన్ని నడ్డా దృష్టికి పవన్ తీసుకెళ్లినట్లు తెలుస్తోంది. తనను పవన్ కల్యాణ్ కలిసిన విషయాన్ని ట్విట్టర్ ద్వారా నడ్డా తెలియజేశారు. వీరి భేటీలో జనసేన నేత నాదెండ్ల మనోహర్ కూడా పాల్గొన్నారు.

Here's JP Nadda Tweet
Had wide-ranging discussions with Shri @PawanKalyan, President of the @JanaSenaParty, regarding the growth and development of Andhra Pradesh and the welfare of its people.
Under the leadership of Hon. PM Shri @narendramodi Ji, the NDA government has been working relentlessly… pic.twitter.com/2IEsf92NQ5
— Jagat Prakash Nadda (@JPNadda) July 20, 2023
(SocialLY brings you all the latest breaking news, fact checks and information from social media world, including Twitter (X), Instagram and Youtube. The above post contains publicly available embedded media, directly from the user's social media account and the views appearing in the social media post do not reflect the opinions of LatestLY.)
(The above story first appeared on LatestLY on Jul 20, 2023 02:15 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

