ప్ర‌ధాని న‌రేంద్ర‌మోదీ (PM Modi) ఆంధ‌ప్ర‌దేశ్‌లోని భీమ‌వ‌రంలో ప‌ర్య‌టించిన విష‌యం తెలిసిందే. ఈ ప‌ర్య‌ట‌న‌లో భీమ‌వ‌రం ప‌ట్ట‌ణంలో ఏర్పాటు చేసిన 30 అడుగుల స్వాతంత్ర స‌మ‌ర‌యోధుడు అల్లూరి సీతారామరాజు విగ్రహాన్ని ప్ర‌ధాని మోదీ ఆవిష్క‌రించారు. ఈ కార్య‌క్ర‌మం సంద‌ర్భంగా మంత్రి రోజా ప్ర‌ధాని మోదీ, సీఎం జ‌గ‌న్‌తో సెల్ఫీ (RK Roja Selfie) దిగారు. అనంత‌రం ఇదే కార్య‌క్ర‌మంలో పాల్గొన్న మెగాస్టార్ చిరంజీవితో సెప‌రేట్‌గా మ‌రో సెల్ఫీ దిగారు. మంత్రి రోజా దిగిన సెల్ఫీలు ఇపుడు నెట్టింట్టో ట్రెండింగ్ అవుతున్నాయి. రోజా, చిరంజీవి కాంబినేష‌న్‌లో వ‌చ్చిన సినిమాలు బాక్సాపీస్ వ‌ద్ద‌ సూప‌ర్ హిట్‌గా నిలిచాయ‌ని ప్ర‌త్యేకించి చెప్ప‌న‌వ‌స‌రం లేదు.

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)