Metro in Pathabasti: త్వరలో పాతబస్తీ వరకూ మెట్రో పరుగులు.. ఎంజీబీఎస్-ఫలక్ నుమా రూట్ లో 5.5 కిలోమీటర్ల మెట్రో మార్గంపై సీఎం కేసీఆర్ దృష్టి.. ఆదేశాలు
పాతబస్తీవాసులకు శుభవార్త. ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న మెట్రో రైలు త్వరలో అందుబాటులోకి రానుంది. ఎంజీబీఎస్-ఫలక్ నుమా మార్గంలో మెట్రో మార్గాన్ని నిర్మించాలంటూ మున్సిపల్ శాఖ, ఎల్ అండ్ టీ సంస్థకు సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు.
Hyderabad, July 11: పాతబస్తీవాసులకు శుభవార్త. ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న మెట్రో రైలు (Metro Train) త్వరలో అందుబాటులోకి రానుంది. ఎంజీబీఎస్-ఫలక్ నుమా (MGBS-Falaknuma) మార్గంలో మెట్రో మార్గాన్ని నిర్మించాలంటూ మున్సిపల్ శాఖ, ఎల్ అండ్ టీ (L&T) సంస్థకు సీఎం కేసీఆర్ (CM KCR) స్పష్టం చేశారు. నగరంలోని వివిధ ప్రాంతాలకు మెట్రో కనెక్టివిటీ (Metro Connectivity) రాగా.. పాతబస్తీలో ప్రాజెక్టుకు సంబంధించి అవాంతరాలు ఎదురయ్యాయి. సుమారు ఆరు ఏడు సంవత్సరాలుగా ఈ మార్గంలో 5.5 కిలోమీటర్ల మేర మెట్రోపనులు ముందుకు కదలలేదు. మెట్రో కోసం పెద్ద సంఖ్యలో ప్రార్థనా మందిరాలు తొలగించాల్సి రావడమే కారణం. మరో మార్గంలో మెట్రో రైలు మార్గాన్ని నిర్మించేందుకు సర్వే నిర్వహించినా పరిస్థితిలో పురోగతి లేకుండా పోయింది. ఈ నేపథ్యంలోనే సీఎం కేసీఆర్ మిగిలిన మార్గాన్ని తక్షణం నిర్మించాల్సిందిగా కోరారు.
It’s Official: KCR gives nod to 5.5-km long Old City Hyderabad Metro Rail #metroproject #OldCity #KCR https://t.co/t0gbwQY3nu
— NewsMeter (@NewsMeter_In) July 10, 2023
(SocialLY brings you all the latest breaking news, fact checks and information from social media world, including Twitter (X), Instagram and Youtube. The above post contains publicly available embedded media, directly from the user's social media account and the views appearing in the social media post do not reflect the opinions of LatestLY.)
(The above story first appeared on LatestLY on Jul 11, 2023 08:43 AM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

