కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ( Rahul Gandhi )పై అన‌ర్హ‌త వేటు వేయ‌డాన్ని బీఆర్ఎస్ అధినేత‌, ముఖ్య‌మంత్రి కేసీఆర్( CM KCR ) తీవ్రంగా ఖండించారు. ప్ర‌ధాని మోదీ( PM Modi ) పాల‌న ఎమ‌ర్జెన్సీ( Emergency )ని మించిపోతుంద‌ని కేసీఆర్ మండిప‌డ్డారు. నేర‌స్తులు, ద‌గాకోరుల కోసం ప్ర‌తిప‌క్ష నాయ‌కుల‌పై అన‌ర్హ‌త వేటు వేసి మోదీ ప‌త‌నాన్ని కొని తెచ్చుకుంటున్నార‌ని కేసీఆర్ తీవ్ర ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. రాహుల్‌పై అన‌ర్హ‌త వేటు వేయ‌డంపై కేసీఆర్ ప్ర‌క‌ట‌న విడుద‌ల చేశారు.

రాహుల్ లోక్‌స‌భ( Lok Sabha ) స‌భ్య‌త్వం ర‌ద్దు చేయ‌డం బీజేపీ( BJP ) నియంతృత్వం, దురహంకార‌మే అని హ‌రీశ్‌రావు మండిప‌డ్డారు. ప్ర‌జాస్వామ్యం( Democracy ), రాజ్యాంగ హ‌క్కులు( Constitutional rights ) ప్ర‌మాదంలో ప‌డ్డాయ‌ని మంత్రి పేర్కొన్నారు.  రాహుల్‌పై అన‌ర్హ‌త వేటు వేయ‌డం.. రాజ్యాంగాన్ని( Constitution ) దుర్వినియోగ‌ప‌ర‌చ‌డ‌మే అని కేటీఆర్ పేర్కొన్నారు. అత్యంత అప్ర‌జాస్వామిక ప‌ద్ధ‌తిలో రాహుల్‌పై వేటు వేశార‌ని, ఇది తొంద‌ర‌పాటు చ‌ర్య అని కేటీఆర్ త‌న ట్వీట్‌లో పేర్కొన్నారు.

Here's TS CMO Tweet

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)