తెలంగాణలో కరోనా వ్యాప్తి బాగా తగ్గింది. గత 24 గంటల్లో 61,573 కరోనా పరీక్షలు నిర్వహించగా, 865 పాజిటివ్ కేసులు వెల్లడయ్యాయి. అత్యధికంగా జీహెచ్ఎంసీ పరిధిలో 263 కేసులు గుర్తించారు. మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలో 67, రంగారెడ్డి జిల్లాలో 60 కేసులు నమోదయ్యాయి. అదే సమయంలో 2,484 మంది ఆరోగ్యవంతులు కాగా, ఒకరు మరణించారు. రాష్ట్రంలో ఇప్పటివరకు 7,80,836 పాజిటివ్ కేసులు నమోదు కాగా... 7,56,883 మంది ఆరోగ్యవంతులయ్యారు. ఇంకా 19,850 మంది చికిత్స పొందుతున్నారు. కరోనా మరణాల సంఖ్య 4,103కి పెరిగింది.

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)