చైనా ఈస్టర్న్‌ ఎయిర్‌లైన్స్‌కు చెందిన బోయింగ్‌ 737 విమానం వుజౌ నగరానికి సమీపంలోని గ్రామీణ ప్రాంతంలోని కొండల్లో కూలిపోయింది. దీంతో భారీగా అగ్నికీలలు, దట్టంగా పొగలు ఎగసిపడినట్లు చైనా అధికార మీడియా సీసీటీవీ తెలిపింది. అందులో 133 మంది ప్రయాణిస్తున్నారు. ఆ ప్రాంతంలో అత్యవసర పరిస్థితిని ప్రకటించిన అధికారులు వెంటనే రెస్క్యూ ఆపరేషన్‌ చేపట్టినట్లు పేర్కొంది. చైనా విమానం కూలిన ఘటనలో ఎంత మంది మరణించి ఉంటారన్నది తెలియరాలేదు. అయితే విమానం కూలిన వెంటనే పెద్ద ఎత్తున మంటలు వచ్చాయి. దీంతో ఆ విమానంలోని ప్రయాణికులు, సిబ్బందికి చెందిన బంధువులు, ఆప్తులు ఆందోళన చెందుతున్నారు.

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)