Coronavirus Scare: కరోనాతో పోరాడుతున్న ఇండియాకు సంఘీభావం ప్రకటించిన పాకిస్తాన్, కోవిడ్ నుంచి భారత్ త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నట్లు తెలిపిన ప్రధాని ఇమ్రాన్ ఖాన్
కరోనా మహమ్మారిపై పోరాడుతోన్న భారత్కు పాకిస్తాన్ ప్రధాని ఇమ్రాన్ఖాన్ సంఘీభావం ప్రకటించారు. కరోనా నుంచి భారత్ త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నట్లు తెలిపారు. ప్రపంచమంతా ఏకమై మహమ్మారిపై పోరాడాలని ఇమ్రాన్ ఖాన్ పిలుపునిచ్చారు.
ఇండియాలో కరోనా సెకండ్ వేవ్ ఉద్ధృతంగా ఉన్న ఈ సమయంలో తాము భారత ప్రజల కోసం ప్రార్థిస్తున్నామని పాకిస్థాన్ సమాచార శాఖ మంత్రి ఫవద్ హుస్సేన్ కూడా ప్రకటించారు ఈ కష్ట సమయంలో మా భారత ప్రజల కోసం మేము ప్రార్థిస్తున్నాం. దేవుడు దయ చూపాలి. త్వరలోనే ఈ కష్టాలు తొలగిపోవాలి అని ఆయన శనివారం ట్వీట్ చేశారు.
ఇండియాలో కరోనా కేసులు రోజుకో రికార్డు సృష్టిస్తున్న విషయం తెలిసిందే. గడిచిన 24 గంటల్లో ఏకంగా 3.42 లక్షల కేసులు నమోదయ్యాయి. అటు పాకిస్థాన్లోనూ కరోనా ఉద్ధృతి కొనసాగుతోంది. కరోనా మహమ్మారి విరుచుకుపడినప్పటి నుంచీ ఎప్పుడూ లేని విధంగా పాకిస్థాన్లో ఒకే రోజులో 157 మంది మృత్యువాత పడ్డారు.
I want to express our solidarity with the people of India as they battle a dangerous wave of COVID-19. Our prayers for a speedy recovery go to all those suffering from the pandemic in our neighbourhood & the world. We must fight this global challenge confronting humanity together
— Imran Khan (@ImranKhanPTI) April 24, 2021
اس مشکل وقت میں ہماری دعائیُں ہندوستان کے شہریوں کے ساتھ ہیں خدا ہم سب پر اپنا کرم اور رحم کرے اور یہ مشکل وقت جلد ختم ہو۔ آمین #CoronavirusPandemic #coronavirus
— Ch Fawad Hussain (@fawadchaudhry) April 24, 2021
(SocialLY brings you all the latest breaking news, fact checks and information from social media world, including Twitter (X), Instagram and Youtube. The above post contains publicly available embedded media, directly from the user's social media account and the views appearing in the social media post do not reflect the opinions of LatestLY.)
(The above story first appeared on LatestLY on Apr 25, 2021 03:47 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

