దక్షిణకొరియాను కరోనా మహమ్మారి వణికిస్తోంది. కేవలం ఒకే రోజులో 4 లక్షలకు పైగా కొత్త కేసులు నమోదు కావడం కలకలం రేపుతోంది. గత 24 గంటల్లో కొత్తగా 4,00,741 పాజిటివ్ కేసులు నమోదయ్యాయని దక్షిణకొరియా ప్రభుత్వం వెల్లడించింది. కరోనా ప్రారంభమైనప్పటి నుంచి ఇంతటి భారీ స్థాయిలో కేసులు నమోదు కావడం ఇదే ప్రథమం. గత 24 గంటల్లో 293 మంది మృతి చెందారు. తాజా కేసులతో కలిపి సౌత్ కొరియాలో ఇప్పటి వరకు నమోదైన కరోనా కేసుల సంఖ్య 76 లక్షలకు చేరుకుంది.

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)