రాష్ట్రీయం

Vijayawada Floods: శాంతించిన బుడమేరు, ప్రకాశం బ్యారేజీకి తగ్గిన వరద, ఊపిరి పీల్చుకున్న బెజవాడ వాసులు, కృష్ణమ్మ ఉగ్రరూపానికి బెంబేలెత్తిన విజయవాడ

Hazarath Reddy

భారీ వరదలు బెజవాడను వణికించాయి. నగర ప్రజలకు మూడు రోజులుగా కంటిమీద కునుకు లేకుండా చేశాయి. భారీ వర్షాలు, వరదలతో రెండు రోజులుగా ఉగ్రరూపం దాల్చిన కృష్ణమ్మ కాస్త శాంతించింది.గత రాత్రి నుంచి ప్రకాశం బ్యారేజి వద్ద వరద ప్రవాహం క్రమ క్రమంగా తగ్గుతూ వస్తోంది.

Telangana Rains: వీడియో ఇదిగో, దుంధుభి నదిలో చిక్కుకున్న 10 మంది చెంచులను రక్షించిన పోలీసులు, అభినందనలు తెలిపిన డీజీపీ

Hazarath Reddy

దుంధుభి నదిలో (Dindi Vagu) చిక్కుకున్న చెంచులు సురక్షితంగా బయటపడ్డారు. వాగులో చిక్కుకున్న పది మందిని రెస్క్యూ బృందాలు రక్షించాయి. గోనబోయినపల్లికి చెందిన చెంచులు గత నెల 31న చేపల వేటకు వెళ్లారు. ఈ క్రమంలో అచ్చంపేట మండలం సిద్ధాపూర్‌ వద్ద దుంధుభి వాగులో వారు చిక్కుకుపోయారు

Donation for Flood Victims: ఎన్టీఆర్ బాటలో విశ్వక్ సేన్.. వరద బాదితులకు ఆసరా.. ఒక్కో రాష్ట్రానికి రూ. 5 లక్షల చొప్పున సాయం

Rudra

తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు దంచికొడుతున్నాయి. మరీ ముఖ్యంగా ఖమ్మం, విజయవాడలో చాలా ప్రాంతాలు నీటమునిగాయి. ఈ క్రమంలోనే ప్రభుత్వం సాయం చేస్తూనే ఉంది.

Donation for Flood Victims: తెలంగాణ ఉద్యోగుల దాతృత్వం.. వ‌ర‌ద బాధితుల‌కు స‌హాయంగా రూ.100 కోట్ల విరాళాన్ని ప్ర‌క‌టించిన ఉద్యోగులు

Rudra

భారీ వర్షాలతో తెలంగాణ అతలాకుతలం అవుతున్నది. పలు జిల్లాలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. వేలాదిమంది నిరాశ్రయులయ్యారు.

Advertisement

Jr NTR: తెలుగు రాష్ట్రాల్లో వరద బీభత్సం.. జూనియర్ ఎన్టీఆర్‌ భారీ విరాళం.. ఒక్కో రాష్ట్రానికి రూ. 50 లక్షల చొప్పున సాయం

Rudra

తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు దంచికొడుతున్నాయి. మరీ ముఖ్యంగా ఖమ్మం, విజయవాడలో చాలా ప్రాంతాలు నీటమునిగాయి. ఈ క్రమంలోనే ప్రభుత్వం సాయం చేస్తూనే ఉంది.

Floods At Edupayala Temple: జల దిగ్బంధంలో ఏడు పాయల వనదుర్గ మాత.. గర్భగుడి మూసేయడంతో రాజగోపురంలో ఉత్సవ విగ్రహానికి పూజలు అందుకుంటున్న అమ్మవారు

Rudra

భారీ వర్షాలతో మంజీరా నది పరవళ్లు తొక్కుతున్నది. దీంతో మెదక్ లోని ఏడు పాయల వనదుర్గ మాత మందిరం మూడో రోజు కూడా జల దిగ్బంధంలోనే ఉంది.

Telangana Rain Update: తెలంగాణను వదలని వర్షాలు.. రానున్న మరో ఐదురోజులు వర్షాలు.. 20 జిల్లాలకు ఎల్లో అలర్ట్‌

Rudra

భారీ వర్షాలతో అతలాకుతలం అయిన తెలంగాణను రానున్న మరో ఐదు రోజులపాటు వర్షాలు ముంచెత్తనున్నాయి. ఈ మేరకు మంగళవారం నుంచి రాబోయే ఐదు రోజులు రాష్ట్రంలో మోస్తరు వర్షాలు కురుస్తాయని హైదరాబాద్‌ వాతా వరణ శాఖ తెలిపింది.

HYDRA Ranganath: హైడ్రా క‌మిష‌న‌ర్ రంగ‌నాథ్‌ కు మ‌రో కీల‌క బాధ్య‌త‌లు?! చెరువుల ప‌రిర‌క్ష‌ణ క‌మిటీ ఛైర్మ‌న్ బాధ్య‌త‌లు అప్ప‌గించే యోచ‌న‌లో రాష్ట్ర సర్కారు

Rudra

సీఎం రేవంత్ రెడ్డి తీసుకొచ్చిన హైడ్రా (హైద‌రాబాద్ డిజాస్ట‌ర్ మేనేజ్‌మెంట్ అండ్ అసెట్ ప్రొటెక్ష‌న్ ఏజెన్సీ) చర్యలతో రాత్రికి రాత్రి హీరో అయిపోయిన ఆ సంస్థ‌కు క‌మిష‌న‌ర్‌, ఐపీఎస్ అధికారి ఏవీ రంగనాథ్ కు మరో కీలక బాధ్యతలు అప్ప‌గించే యోచ‌న‌లో తెలంగాణ స‌ర్కార్ ఉన్న‌ట్లు తెలుస్తోంది.

Advertisement

IMD Weather Update: తెలుగు రాష్ట్రాలకు పొంచి ఉన్న మరో ముప్పు, బంగాళాఖాతంలో ఈ నెల 5న అల్పపీడనం, రానున్న మూడు రోజులు పాటు భారీ వర్షాలు

Hazarath Reddy

రామగుండం పట్టణానికి ఉత్తర ఈశాన్య దిశగా 135 కిలోమీటర్లు, వాగ్ధాకు అగ్నేయంగా 170 కిలోమీటర్లు దూరంలో ఈ వాయు గుండం కేంద్రీకృతమై ఉందని వెల్లడించింది. వాయువ్య దిశగా కదులుతూ రాగల 12 గంటలలో బలహీన పడి తీవ్ర అల్పపీడనంగా మారే అవకాశం ఉందని విశాఖ వాతావరణ కేంద్రం తెలిపింది.

Andhra Pradesh Rains: వీడియో ఇదిగో, మోకాలి లోతు నీటిలో నడుచుకుంటూ వెళ్లిన చంద్రబాబు, వరద ప్రభావిత ప్రాంతాల్లో ముగిసిన సీఎం పర్యటన

Hazarath Reddy

విజయవాడ నగరంలోని వరద ప్రభావిత ప్రాంతాల్లో సీఎం చంద్రబాబు పర్యటన ముగిసింది. సోమవారం ఉదయం నుంచి ముంపు ప్రాంతాల్లో సుమారు నాలుగు గంటల పాటు నిర్విరామంగా సీఎం పర్యటించారు.

Vijayawada Floods: విజయవాడలో వరద బాధితులకు హెలికాప్టర్ల ద్వారా ఆహారం పంపిణీ, బాధితులకు ఆహారం అందించేందుకు ముందుకు వచ్చిన దివీస్, అక్షయపాత్ర సంస్థలు

Hazarath Reddy

విజయవాడలో వరద బాధితులకు ఆపన్న హస్తం అందించేందుకు ఏపీ ప్రభుత్వం హెలికాప్టర్లను కూడా రంగంలోకి దించింది. నగరంలోని పలు ప్రాంతాల్లో వరద బాధితులకు నేడు హెలికాప్టర్ల ద్వారా ఆహారం అందించారు. బుడమేరు ముంపునకు గురైన ప్రాంతాల్లో రెండు హెలికాప్టర్ల సాయంతో ఆహార ప్యాకెట్లను, మంచినీటి బాటిళ్లను జారవిడిచారు.

Telugu States Floods:  తెలుగు రాష్ట్రాల్లో జల ప్రళయం, రూ.  5 లక్షలు విరాళం ప్రకటించిన మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు

Hazarath Reddy

ఏపీ, తెలంగాణ రాష్ట్రాలను భారీ వరదలు ముంచెత్తాయి. భారీ వర్షాలతో రెండు రాష్ట్రాలు విలవిల్లాడుతున్నాయి. ఈ వరదలపై మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు విచారం వ్యక్తం చేశారు. తనకు వచ్చే పెన్షన్ నుంచి రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రుల సహాయనిధికి రూ. 5 లక్షల చొప్పున సహాయాన్ని ప్రకటించారు.

Advertisement

Andhra Pradesh Road Accident: కావలిలో ఘోర రోడ్డు ప్రమాదం, కంటైనర్ కిందకు బైక్ దూసుకువెళ్లడంతో మంటలు, ఇద్దరికీ తీవ్ర గాయాలు

Hazarath Reddy

కావలి రూరల్ పరిధిలోని రుద్రకోట సమీపంలో హైవే పై లారీ, బైక్ ఢీ..ఇద్దరికీ గాయాలు. రోడ్డు ప్రమాదం లో కంటైనర్ కిందకు వెళ్లిన ద్విచక్ర వాహనం నుండి మంటలు, బైక్ పూర్తిగా దగ్ధం, కంటైనర్ కు కూడా అంటుకున్న మంటలు.మంటలార్పిన అగ్నిమాపక శాఖ...క్షతగాత్రులను కావలి ఆసుపత్రికి తరలింపు.

Vijayawada Rains: వీడియో ఇదిగో, కరకట్ట మీద నీట మునిగిన మంతెన సత్యనారాయణ ఆశ్రమం, భవానిపురానికి పొంచి ఉన్న వరద ముప్పు

Hazarath Reddy

కృష్ణా నది మహోగ్రరూపంతో కరకట్ట వాసులు భయం భయంగా గడుపుతున్నారు. మంతెన సత్యనారాయణ రాజు ఆశ్రమంలోకి కూడా నీట మునిగింది.గత రాత్రి అమరావతి రైతులు, అధికారులు ఎంత ప్రయత్నించినా పరిస్థితి అదుపులోకి రాలేదు. ఆశ్రమంలోకి నీళ్లు చేరాయి. దీంతో అందులో చికిత్స పొందుతున్న వారిని ఆశ్రమం నిర్వాహకులు బయటకు పంపేస్తున్నారు.

Telangana Rains: వీడియో ఇదిగో, భారీ వరదలకు నీట మునిగిన ఏడుపాయల వనదుర్గాదేవి ఆలయం, భారీగా పెరుగుతున్న వరద ఉధృతి

Hazarath Reddy

తెలంగాణలో వర్షం విలయం సృష్టించింది. కుంభవృష్టి కురవడంతో రాష్ట్రంలో జనజీవనం అతలాకుతలమైంది. వానలకు వాగులు, వంకలు పొంగిపొర్లి గ్రామాలు, కాలనీల్లోని లోతట్టు ప్రాంతాలను ముంచెత్తాయి. ప్రధానంగా ఉమ్మడి ఖమ్మం, వరంగల్, నల్గొండ జిల్లాల్లో భారీ నష్టం వాటిల్లింది.

Telugu States Floods: మా ఆలోచనలన్నీ తెలుగు రాష్ట్రాల ప్రజలతోనే, భారీ వరదల నేపథ్యంలో స్పందించిన రాహుల్ గాంధీ, ఆత్మీయులను కోల్పోయిన కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి

Hazarath Reddy

తెలుగు రాష్ట్రాల్లో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలు, వరదలపై ఏఐసీసీ అగ్రనేత, లోక్ సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ ఎక్స్ వేదికగా స్పందించారు. తన ఆలోచనలు అన్నీ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ప్రజలతోనే ఉన్నాయని పేర్కొన్నారు. వరదల వల్ల ఆత్మీయులను కోల్పోయిన కుటుంబాలకు ఆయన ప్రగాఢ సానుభూతి తెలిపారు.

Advertisement

Andhra Pradesh: వీడియో ఇదిగో, బాలికపై అత్యాచారయత్నం చేసిన వ్యక్తిని స్థంభానికి కట్టేసి చితకబాదిన స్థానికులు

Hazarath Reddy

నంద్యాల - అవుకు మండలం కాశిపురం గ్రామంలో ఏడో తరగతి చదువుతున్న విద్యార్థినిపై అత్యాచారయత్నం చేసిన దాసయ్య. బాలిక కేకలు వేయటంతో దాసయ్యను పట్టుకున్న స్థానికులు.. కట్టేసి కొట్టి, నిందితుడిని పోలీసులకు అప్పగించిన స్థానికులు. ఘటనకు సంబంధించిన వీడియో ఇదిగో..

Vijayawada Floods: వీడియో ఇదిగో, విజయవాడ వరద బాధిత ప్రాంతాల్లో పర్యటిస్తున్న జగన్, కృష్ణలంక వాసుల్ని కలిసిన మాజీ సీఎం, బాధితులకు అండగా ఉండాలని వైసీపీ శ్రేణులకు పిలుపు

Hazarath Reddy

పులివెందుల పర్యటన ముగించుకుని విజయవాడ చేరుకున్నారు వైఎస్‌ జగన్‌. విజయవాడ కృష్ణలంక ఏరియాలో రిటైనింగ్‌ వాల్‌ దగ్గర కృష్ణా నది ప్రవాహాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన సీఎంగా ఉన్న సమయంలో కట్టించిన రిటైనింగ్‌ వాల్‌ వల్లే తమ ప్రాణాలు నిలిచాయని వైఎస్‌ జగన్‌కు కృష్ణలంక వాసులు కృతజ్ఞతలు తెలిపారు

Vijayawada Rains: వీడియో ఇదిగో, మంచినీళ్లు లేవు, ఆహారం లేదు, కాపాడాలంటూ వీడియో ద్వారా వేడుకున్న విజయవాడ వైఎస్ఆర్ కాలనీవాసులు

Hazarath Reddy

భారీ వర్షాలతో వాగులు, వంకలు ఉధృత రూపం దాల్చడంతో విజయవాడ నగరం పూర్తిగా జలదిగ్బంధంలో చిక్కుకుంది.రహదారులు.. వాగులు, వంకలుగా మారాయి. భారీ నుంచి అతి వర్షాలకు కొండవీటి వాగు ఉప్పొంగింది.

Vijayawada Floods: వీడియో ఇదిగో, ప్రకాశం బ్యారేజీ రైల్వే పైబ్రిడ్జిని తాకిన కృష్ణమ్మ, 125 సంవత్సరాల బ్యారేజ్ చరిత్రలో రికార్డ్‌ స్ధాయిలో వరద, 11 లక్షల క్యూసెక్కులు దాటిన వరద ప్రవాహం

Hazarath Reddy

ప్రకాశం బ్యారేజీలోకి వచ్చి చేరుతున్న వరద ఉధృతి గంటగంటకూ పెరుగుతోంది. ఫలితంగా ప్రకాశం బ్యారేజీ వరద ఉధృతి ఆల్ టైం రికార్డు స్ధాయిలో నమోదైంది. సోమవారం ఉదయం 125 సంవత్సరాల బ్యారేజ్ చరిత్రలో రికార్డ్‌ స్ధాయిలో కృష్ణమ్మకి వరద కొనసాగుతుంది. ప్రస్తుతం ప్రకాశం బ్యారేజ్ వద్ద 11.25 లక్షలు క్యూసెక్కులు ఇన్ ఫ్లో దాటింది

Advertisement
Advertisement