Mohanbabu: మోహన్ బాబు ఇంట్లో విషాదం, కన్నీటి సంద్రంలో మునిగిపోయిన మంచు విష్ణు, మంచు లక్ష్మి, ఏం జరిగిందంటే..?

ప్రముఖ సీనియర్​ నటుడు మోహన్​బాబు  సోదరుడు రంగస్వామి(63) తుదిశ్వాస విడిచారు. ఆయన మృతి పట్ల పలువురు నివాళులు అర్పిస్తున్నారు. తిరుపతిలో ఉండే ఆయన సోదరుడు రంగస్వామి నాయుడు(63) గుండెపోటుతో కన్నుమూశారు. దీంతో మోహన్​బాబు కుటుంబం, బంధుమిత్రులు శోకసంద్రంలో మునిగిపోయారు. కాగా, రంగస్వామి మృతి పట్ల పలువురు సంతాపం వ్యక్తం చేస్తున్నారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నారు. రంగస్వామి అంత్యక్రియలు గురువారం ఉదయం నిర్వహించనున్నారు. రంగస్వామి తిరుపతిలో వ్యవసాయం చేసుకుంటూ జీవించేవారు. మోహన్​బాబు చేపట్టే పలు సామాజిక కార్యక్రమాల్లోనూ చురుకుగా పాల్గొనేవారు.