Giridhar Gamang joins BRS (PIC @ BRS Twitter)

Hyderabad, April 11: పొరుగు రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ (Andhrapradesh) లోనూ ఉనికిని చాటుకోవాలని భావించిన బీఆర్ఎస్ (BRS) పార్టీకి కేంద్ర ఎన్నికల సంఘం (ఈసీ-EC) తీసుకున్న తాజా నిర్ణయం పెద్ద షాక్ ఇచ్చింది. అసలేమైందంటే..  కేంద్ర ఎన్నికల సంఘం నిన్న దేశవ్యాప్తంగా రాజకీయ పార్టీల గుర్తింపులో కీలక మార్పులు చేసింది. ఈ క్రమంలో, బీఆర్ఎస్ పార్టీకి ఏపీలో రాష్ట్ర పార్టీ హోదా (State Status) ఉపసంహరించింది. ఈసీ తాజా నిర్ణయంతో ఆ పార్టీకి నిరాశ తప్పలేదనే వార్తలు వినిపిస్తున్నాయి.

RCB vs LSG, IPL 2023: రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో జరిగిన హైవోల్టేజీ మ్యాచ్‌లో లక్నో సూపర్ జెయింట్ 1 వికెట్ తేడాతో విజయం

ఎందుకు గుర్తింపు ఇవ్వలేదు?

రాష్ట్ర పార్టీగా గుర్తింపు పొందాలంటే... ఆ రాష్ట్రంలో చివరగా జరిగిన ఎన్నికల్లో కనీసం 6 శాతం ఓట్లు కానీ, మొత్తం అసెంబ్లీ స్థానాల్లో 3 శాతం సీట్లు కానీ సాధించాల్సి ఉంటుంది. అటు, 25 ఎంపీ సీట్లకు కనీసం ఒకటైనా గెలిచి ఉండాలి. పార్టీ అభ్యర్థులకు కనీసం 8 శాతం ఓట్లయినా వచ్చి ఉండాలి. ఈ లెక్కన చూస్తే... ఏపీలో బీఆర్ఎస్ పార్టీ ఒక్కసారి కూడా పోటీ చేయలేదు. అందువల్లే ఏపీలో బీఆర్ఎస్ కు రాష్ట్ర పార్టీ హోదా దక్కలేదు. తెలంగాణలో మాత్రమే బీఆర్ఎస్ కు రాష్ట్ర పార్టీ హోదా ఇస్తున్నట్టు ఈసీ ప్రకటనలో వెల్లడించింది.

Supreme Court: కరోనా మృతుల కుటుంబాలకు నష్టపరిహారం ఇవ్వండి, ఏపీ సర్కారుకు ఆదేశాలు జారీ చేసిన సుప్రీంకోర్టు, రాష్ట్రంలో కరోనాతో 14 వేల మందికి పైగా మృతి

ఆ పార్టీలకు కూడా షాక్

ఇక, ఉత్తరప్రదేశ్ లో రాష్ట్రీయ లోక్ దళ్ (ఆర్ఎల్డీ), పశ్చిమ బెంగాల్ లో ఆర్ ఎస్పీలకు రాష్ట్ర పార్టీ హోదా రద్దు చేసింది. అటు, మేఘాలయలో వాయిస్ ఆఫ్ ద పీపుల్స్ పార్టీకి, త్రిపురలో తిప్రా మోతా పార్టీ, నాగాలాండ్ లో జనశక్తి పార్టీకి రాష్ట్ర పార్టీగా గుర్తింపునిస్తున్నట్టు ఈసీ ప్రకటించింది. ఎలక్షన్ సింబల్స్ ఆర్డర్-1968 పేరా 6 ప్రకారం ఈసీ ఈ మేరకు నిర్ణయించింది.