MMTS Trains Cancelled: జంట‌న‌గ‌ర‌వాసుల‌కు అల‌ర్ట్! రేపు, ఎల్లుండి ప‌లు ఎంఎంటీఎస్ రైళ్లు ర‌ద్దు, ఏయే స‌ర్వీసులు ర‌ద్ద‌య్యాయంటే?

హైదరాబాద్‌, సికింద్రాబాద్‌ జంట నగరాల్లో మే 25, 26 తేదీల్లో పలు ఎంఎంటీఎస్‌ (MMTS Trains) సర్వీసులను, నాలుగు డెమూ (Demu) సర్వీసులను రద్దు చేశారు. ఈ మేరకు దక్షిణ మధ్య రైల్వే ఒక ప్రకటన చేసింది. సికింద్రాబాద్‌ రైల్వేస్టేషన్‌ ఆధునికీకరణ పనులు, ఫుట్‌ ఓవర్‌ వంతెనల (FOB) ల నిర్మాణం నేపథ్యంలో రెండు రోజులపాటు పలు రైలు సర్వీసులను రద్దు చేశారు.

MMTS Trains Cancelled: జంట‌న‌గ‌ర‌వాసుల‌కు అల‌ర్ట్! రేపు, ఎల్లుండి ప‌లు ఎంఎంటీఎస్ రైళ్లు ర‌ద్దు, ఏయే స‌ర్వీసులు ర‌ద్ద‌య్యాయంటే?
MMTS(Photo-Twitter/South Central Railway)

Hyderabad, May 24: హైదరాబాద్‌, సికింద్రాబాద్‌ జంట నగరాల్లో మే 25, 26 తేదీల్లో పలు ఎంఎంటీఎస్‌ (MMTS Trains) సర్వీసులను, నాలుగు డెమూ (Demu) సర్వీసులను రద్దు చేశారు. ఈ మేరకు దక్షిణ మధ్య రైల్వే ఒక ప్రకటన చేసింది. సికింద్రాబాద్‌ రైల్వేస్టేషన్‌ ఆధునికీకరణ పనులు, ఫుట్‌ ఓవర్‌ వంతెనల (FOB) ల నిర్మాణం నేపథ్యంలో రెండు రోజులపాటు పలు రైలు సర్వీసులను రద్దు చేశారు. సికింద్రాబాద్‌-ఫలక్‌నుమా, మేడ్చల్‌-సికింద్రాబాద్‌, లింగంపల్లి-మేడ్చల్‌, హైదరాబాద్‌-మేడ్చల్‌ మధ్య సేవలందించే 22 ఎంఎంటీఎస్‌ సర్వీసులను రద్దు చేస్తున్నట్లు చీఫ్‌ పీఆర్వో సీహెచ్‌ రాకేశ్‌ ఒక ప్రకటనలో వెల్లడించారు.

 

వీటితోపాటు సిద్దిపేట-సికింద్రాబాద్‌ మధ్య సర్వీసులందించే నాలుగు డెమూ రైళ్లను రద్దు చేస్తున్నట్లు తెలిపారు. కొన్ని రైళ్లను రెండు రోజుల పాటు, మరికొన్నింటిని ఒక్కరోజు రద్దు చేస్తున్నట్లు ప్రకటనలో పేర్కొన్నారు.

(The above story first appeared on LatestLY on May 24, 2024 09:32 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).