Writer Sri Ramana Passes Away: టాలీవుడ్ లో మరో విషాదం, అనారోగ్యంతో ప్రముఖ దర్శకుడు కన్నుమూత, నివాళులు అర్పిస్తున్న ప్రముఖులు
ఇటీవల సినీ పరిశ్రమలో పలువురు ప్రముఖులు మరణించి విషాదం నింపారు. తాజాగా టాలీవుడ్ లో మరో ప్రముఖ రచయిత కన్నుమూశారు. బాపు, రమణ, తనికెళ్ళ భరణి.. లాంటి పలువురు రచయితలు, దర్శకుల వద్ద పనిచేసిన సీనియర్ రచయిత శ్రీరమణ మరణించారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న శ్రీ రమణ నేడు జులై 19 తెల్లవారుజామున 5 గంటలకు మరణించారు.
Hyderabad, July 19: ఇటీవల సినీ పరిశ్రమలో పలువురు ప్రముఖులు మరణించి విషాదం నింపారు. తాజాగా టాలీవుడ్ లో మరో ప్రముఖ రచయిత కన్నుమూశారు. బాపు, రమణ, తనికెళ్ళ భరణి.. లాంటి పలువురు రచయితలు, దర్శకుల వద్ద పనిచేసిన సీనియర్ రచయిత శ్రీరమణ మరణించారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న శ్రీ రమణ నేడు జులై 19 తెల్లవారుజామున 5 గంటలకు మరణించారు. 70 ఏళ్ళ వయసులో కన్నుమూశారు శ్రీ రమణ. దీంతో చిత్రపరిశ్రమలో విషాదం నెలకొంది. పలువురు ప్రముఖులు ఆయనకు నివాళులు అర్పిస్తున్నారు.
ప్రముఖ రచయిత శ్రీరమణ అనారోగ్యంతో కన్నుమూత... ఆంధ్రజ్యోతి, సాక్షి, భక్తి టీవీ లో పనిచేసిన శ్రీరమణ.. ఆయన మృతికి పలువురి సంతాపం #sriramana #mithunam
— Telugu Popular TV (@TeluguPopularTV) July 19, 2023
బాపట్ల జిల్లా వేమూరు మండలం వరహాపురంలో శ్రీరమణ జన్మించారు. అక్కడే ఫస్ట్ ఫారమ్లో చేరిన శ్రీరమణ.. తర్వాత బాపట్ల ఆర్ట్స్ కాలేజీలో పీయూసీ పూర్తి చేశారు. అనంతరం నవ్య వార పత్రికకు ఎడిటర్గానూ ఆయన పనిచేశారు. పేరడి రచనలతో గుర్తింపు తెచ్చుకున్నారు. శ్రీరమణ జర్నలిస్ట్ గా కెరీర్ మొదలు పెట్టి అనంతరం నవ్య వార్తాపత్రికకు ఎడిటర్ గా పనిచేసి, సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చి కథా రచయితగా, డైలార్ రైటర్ గా పనిచేశారు. తనికెళ్ళ భరణి దర్శకత్వంలో వచ్చిన మిథునం సినిమాకు కథ అందించింది ఈయనే. ఆ సినిమా శ్రీ రమణకు ఎంతగానో పేరు తెచ్చింది.
(The above story first appeared on LatestLY on Jul 19, 2023 09:48 AM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

