Rashmika Mandanna: నిషేధమా? అంతా అబద్ధం.. కర్ణాటకలో తనపై నిషేధం విధించారన్న వార్తలపై రష్మిక స్పందన

కన్నడ చిత్ర పరిశ్రమలో తనపై నిషేధం కొనసాగుతున్నదంటూ గతకొంతకాలంగా జరుగుతున్న ప్రచారంపై అగ్ర కథానాయిక రష్మిక మందన్న స్పందించారు. తనపై ఎలాంటి నిషేధం విధించలేదని స్పష్టం చేశారు.

Rashmika Mandanna: నిషేధమా? అంతా అబద్ధం.. కర్ణాటకలో తనపై నిషేధం విధించారన్న వార్తలపై రష్మిక స్పందన
File: Credits.. ANI

Bengaluru, Dec 9: కన్నడ చిత్ర పరిశ్రమలో తనపై నిషేధం కొనసాగుతున్నదంటూ గతకొంతకాలంగా జరుగుతున్న ప్రచారంపై అగ్ర కథానాయిక రష్మిక మందన్న (Rashmika Mandanna) స్పందించారు. తనపై ఎలాంటి నిషేధం విధించలేదని స్పష్టం చేశారు. 'కాంతార' (Kantara) విషయంలో తనపై కొందరు అత్యుత్సాహం చూపారని వెల్లడించారు. అందుకే ఇలాంటి తప్పుడు ప్రచారం (Fake Publicity) జరుగుతున్నట్టు మండిపడ్డారు.

సినీ పరిశ్రమలో తీవ్ర విషాదం, అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన ప్రముఖ మాలీవుడ్ నిర్మాత జైసన్​ జోసెఫ్, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న పోలీసులు

"కాంతార సినిమా చూసి చిత్రబృందానికి మెసేజ్ పెట్టాను. సినీ నటుల మధ్య ఏం జరుగుతుందనేది బయటి ప్రపంచానికి తెలియదు. అయినా నా వ్యక్తిగత జీవితం ప్రజలకు అవసరం లేదు. వృత్తిపరంగా ఏంచేస్తున్నానో చెప్పడం నా బాధ్యత. అంతవరకే. అంతేతప్ప నా పర్సనల్ విషయాలను అందరికీ చూపలేను. మెసేజ్ లు బయటికి విడుదల చేయలేను" అంటూ రష్మిక స్పష్టం చేశారు.

(The above story first appeared on LatestLY on Dec 09, 2022 10:34 AM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).