Commission on AP Stampedes: చంద్రబాబు సభల్లో ప్రమాదాలపై విచారణకు ప్రత్యేక కమిషన్, హైకోర్టు రిటైర్డు జడ్జీ నేతృత్వంలో విచారణ
ఈ ఘటనలపై రాజకీయ రచ్చ కూడా జరిగింది. పోలీసుల వైఫల్యం వల్లనే గుంటూరు తొక్కిసలాట జరిగిందని టీడీపీ ఆరోపించింది. దానికి వైసీపీ నేతలు కూడా కౌంటర్ ఇచ్చారు. ఇరుకు సందుల్లో సభలు పెట్టడం వల్లనే ప్రజలు చనిపోయారంటూ వైసీపీ ఆరోపించింది. దీంతో ఈ ఘటనలపై సమగ్ర దర్యాప్తునకు జగన్ ప్రభుత్వం ఆదేశించింది. ఇందుకోసం హైకోర్టు రిటైర్డు జడ్జితో విచారణ కమిటీని నియమించింది.
Amaravati, JAN 07: టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు (Chandrababu) నిర్వహించిన సభల్లో జరిగిన తొక్కిసలాట (Stampede) ఘటనలపై విచారణ కమిషన్ ఏర్పాటు చేసింది ప్రభుత్వం. ఈ ఘటనలను సీరియస్ గా తీసుకున్న ప్రభుత్వం... హైకోర్టు రిటైర్డు జస్టిస్ బి. శేష శయనరెడ్డి (Justice B. Shesha Shayana reddy) నేతృత్వంలో విచారణ కమిటీని నియమించింది. ఈ ఘటనలపై విచారణ కమిటీ విచారించనుంది. చంద్రబాబు నాయుడు డిసెంబర్ లో నెల్లూరు జిల్లా కందుకూరులో నిర్వహించిన సభలో తొక్కిసలాట జరిగి 8 మంది మృతి చెందారు. అనంతరం జనవరి 1న గుంటూరులో జరిగిన సభలోనూ తొక్కిసలాట జరిగింది. అందులో ముగ్గురు మహిళలు మరణించారు. దాంతో చంద్రబాబు సభలకు పర్మిషన్ ఇవ్వడంపై పునరాలోచనలో పడింది ప్రభుత్వం.
అయితే ఈ ఘటనలపై రాజకీయ రచ్చ కూడా జరిగింది. పోలీసుల వైఫల్యం వల్లనే గుంటూరు తొక్కిసలాట జరిగిందని టీడీపీ ఆరోపించింది. దానికి వైసీపీ నేతలు కూడా కౌంటర్ ఇచ్చారు. ఇరుకు సందుల్లో సభలు పెట్టడం వల్లనే ప్రజలు చనిపోయారంటూ వైసీపీ ఆరోపించింది. దీంతో ఈ ఘటనలపై సమగ్ర దర్యాప్తునకు జగన్ ప్రభుత్వం ఆదేశించింది. ఇందుకోసం హైకోర్టు రిటైర్డు జడ్జితో విచారణ కమిటీని నియమించింది. త్వరలోనే ఈ కమిటీ విచారణ చేపట్టనుంది.
(The above story first appeared on LatestLY on Jan 07, 2023 10:56 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

