SSC MTS Exams in Regional Languages: స్టాఫ్ సెలక్షన్ కమీషన్ పరీక్షలు ఇక తెలుగులో, ఇంగ్లీష్ తో పాటు 13 ప్రాంతీయ భాషల్లో నిర్వహణకు ఆమోదం తెలిపిన కేంద్రం

స్టాఫ్ సెలక్షన్ కమీషన్ మల్టీ టాస్కింగ్ స్టాఫ్ (ఎస్ఎస్సి ఎంటిఎస్) పరీక్ష, సిహెచ్ఎస్ఎల్ఈ పరీక్ష హిందీ, ఇంగ్లీష్ తో పాటు 13 ప్రాంతీయ భాషల్లో కూడా నిర్వహణకు సిబ్బంది, శిక్షణ విభాగం (డిఓపిటి) ఆమోదం తెలిపిందని కేంద్ర మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ వెల్లడించారు.

SSC MTS Exams in Regional Languages: స్టాఫ్ సెలక్షన్ కమీషన్ పరీక్షలు ఇక తెలుగులో, ఇంగ్లీష్ తో పాటు 13 ప్రాంతీయ భాషల్లో నిర్వహణకు ఆమోదం తెలిపిన కేంద్రం
Representational Image (File Photo)

స్థానిక యువత భాగస్వామ్యాన్ని ప్రోత్సహించడానికి, ప్రాంతీయ భాషలకు మరింత ప్రాధాన్యతనిస్తూ ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ చొరవతో తీసుకున్న ఒక చారిత్రాత్మక నిర్ణయం ఇది. స్టాఫ్ సెలక్షన్ కమీషన్ మల్టీ టాస్కింగ్ స్టాఫ్ (ఎస్ఎస్సి ఎంటిఎస్) పరీక్ష, సిహెచ్ఎస్ఎల్ఈ పరీక్ష హిందీ, ఇంగ్లీష్ తో పాటు 13 ప్రాంతీయ భాషల్లో కూడా నిర్వహణకు సిబ్బంది, శిక్షణ విభాగం (డిఓపిటి) ఆమోదం తెలిపిందని కేంద్ర మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ వెల్లడించారు.

హిందీ, ఇంగ్లిష్‌తో పాటు 13 ప్రాంతీయ భాషలు అస్సామీ, బెంగాలీ, గుజరాతీ, మరాఠీ, మలయాళం, కన్నడ, తమిళం, తెలుగు, ఒడియా, ఉర్దూ, పంజాబీ, మణిపురి (మీతి), కొంకణి భాషలలో కూడా పరీక్ష నిర్వహిస్తున్నట్టు డాక్టర్ జితేంద్ర సింగ్ తెలిపారు. ఈ నిర్ణయం వల్ల లక్షలాది మంది ఔత్సాహికులు వారి మాతృభాష/ప్రాంతీయ భాషలో పరీక్షలో పాల్గొనవచ్చు. వారి ఎంపిక అవకాశాలు ఇంకా మెరుగుపడతాయి.

ఇంగ్లీష్, హిందీ కాకుండా ఇతర భాషలలో ఎస్ఎస్సి పరీక్షలను నిర్వహించాలని వివిధ రాష్ట్రాల నుండి నిరంతర డిమాండ్లు ఉన్నాయి. ఇతర విషయాలతోపాటు (కమీషన్ నిర్వహించే పరీక్షల పథకం, సిలబస్ సమీక్ష) ఈ అంశాన్ని కూడా పరిశీలించడానికి ప్రభుత్వం ఒక నిపుణుల కమిటీని నియమించింది.

ఇంగ్లీష్ మీడియం ఉన్నా స్థానిక భాషల్లో పరీక్షలు రాసేందుకు విద్యార్థులను అనుమతించండి, యూనివర్సిటీలకు యూజీసీ ఆదేశాలు జారీ

నిపుణుల కమిటీ తన నివేదికలో ఈ క్రింది వాటిని సిఫార్సు చేసింది: “ఎస్ఎస్సి ప్రత్యేకించి గ్రూప్ ‘సి’ పోస్టుల అధ్యయనం ఈ పోస్ట్‌లు ప్రభుత్వ-పౌరుల పరస్పర చర్యలో అత్యాధునిక స్థాయిలో ఉన్నాయని సూచిస్తుంది. భారతదేశం బహుళ భాషలు మాట్లాడే దేశం అయినందున, ఈ పరీక్షలను వివిధ భాషల్లో నిర్వహించడం సరైనదని ప్రభుత్వం భావించింది. రాజ్యాంగంలోని షెడ్యూల్ VIIIలో పేర్కొన్న అన్ని భాషలను చేర్చడానికి క్రమంగా మిగిలిన పరీక్షలకు కూడా పెంచడానికి ప్రస్తుత నిర్ణయం మార్గం వేసింది. నిపుణుల కమిటీ యొక్క సిఫార్సును ప్రభుత్వం ఆమోదిస్తూ విధివిధానాలను రూపొందించాలని ఎస్ఎస్సి ని కోరింది.

ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ సెలక్షన్ (ఐబిపిఎస్) / రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డులు (ఆర్ఆర్బిలు) ద్వారా 15 భాషలలో (13 ప్రాంతీయ భాషలు + హిందీ + ఇంగ్లీష్) ఎంటిఎస్ పరీక్ష- 2022, సిహెచ్ఎస్ఎల్ పరీక్ష- 2022 నిర్వహించాలని కమిషన్ నిర్ణయించింది. ఎంటిఎస్ పరీక్ష నోటిఫికేషన్ ఇప్పటికే జారీ అయింది. బహుళ భాషలో సిహెచ్ఎస్ఎల్ పరీక్ష కోసం నోటీసు మే-జూన్ 2023లో జారీ చేస్తారు.

రాజ్యాంగంలోని ఎనిమిదో షెడ్యూల్‌ జాబితాలో ఉన్న అన్ని భాషలను చేర్చడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయని కేంద్ర సిబ్బంది, ప్రజా ఫిర్యాదులు, పెన్షన్ల శాఖ సహాయ మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ అన్నారు. ప్రాంతీయ అసమానతలను తొలగించడానికి, రాజ్యాంగ సూత్రాలను గ్రహించడానికి, మన దేశం భాషా వైవిధ్యాన్ని గుర్తించడానికి అన్ని వర్గాల ప్రజలకు సమాన అవకాశాలు ఉండేలా ఎస్ఎస్సి నిరంతరం పనిచేస్తుందని ఆయన తెలిపారు.

ప్రతి ఒక్కరూ ఉద్యోగాల కోసం దరఖాస్తు చేసుకునేందుకు సమాన అవకాశం కల్పించాలని, భాషాపరమైన సమస్య కారణంగా ఎవరూ అనర్హులకు గురికాకుండా, నష్టపోకుండా ఉండాలనే ప్రధాని నరేంద్ర మోదీ దార్శనికతకు అనుగుణంగా ఈ చర్య తీసుకున్నట్లు మంత్రి తెలిపారు. గతంలో ఇంగ్లీష్, హిందీలో నిర్వహించే పరీక్షల కోసం అనేక రాష్ట్రాల నుండి, ముఖ్యంగా దక్షిణ భారతదేశం నుండి అభ్యర్థుల దీర్ఘకాలిక అభ్యర్థనలను పరిగణంలోకి తీసుకోవడంతో ఈ నిర్ణయం ఎంతో మందికి సంతోషాన్ని కలిగిస్తుందని కేంద్ర మంత్రి తెలిపారు.

ఎంటిఎస్ 2022 పరీక్ష నోటీసుకు ముఖ్యంగా దక్షిణ భారతదేశానికి చెందిన అభ్యర్థుల నుండి, సోషల్ మీడియాలో సానుకూల స్పందన లభించిందని మంత్రి చెప్పారు. బహుళ-భాషలో మొదటి పరీక్ష (ఎంటిఎస్ 2022) మే 2 నుండి ప్రారంభమవుతుంది.

డాక్టర్ జితేంద్ర సింగ్ మాట్లాడుతూ, రాష్ట్రాలు/యుటి ప్రభుత్వాలు స్థానిక యువత తమ మాతృభాషలో పరీక్ష రాసేలా ఈ అవకాశాన్ని ఉపయోగించుకుని దేశానికి సేవ చేసేందుకు పెద్ద సంఖ్యలో పాల్గొనేలా ప్రోత్సహించేందుకు విస్తృత ప్రచారాన్ని ప్రారంభించాలని భావిస్తున్నట్లు తెలిపారు. ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ నాయకత్వం, కేంద్ర సిబ్బంది, ప్రజా ఫిర్యాదులు, పెన్షన్ల శాఖ సహాయ మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ మార్గదర్శకత్వంలో ప్రాంతీయ భాషల వినియోగాన్ని, అభివృద్ధిని ప్రోత్సహించడానికి సిబ్బంది, శిక్షణ విభాగం పూర్తిగా కట్టుబడి ఉంది.

PIB Press Note

(The above story first appeared on LatestLY on Apr 19, 2023 02:56 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).