Wolves Smarter Than Us: ప్రభుత్వం కంటే తోడేళ్లు తెలివైనవన్న యూపీ మంత్రి.. అసలేమైంది? తోడేళ్లు అంటే యూపీ ప్రజలు, ప్రభుత్వం ఎందుకు గడగడలాడుతున్నది?

మానవ రక్తం రుచి మరిగి ప్రాణాంతకంగా మారిన తోడేళ్ల బెడదతో యూపీలోని బహరాయిచ్‌ జిల్లా గడగడలాడుతున్నది. ఈ మృగాలను పట్టుకునేందుకు అనేక ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ అవి చిక్కడం లేదు.

Wolves Smarter Than Us: ప్రభుత్వం కంటే తోడేళ్లు తెలివైనవన్న యూపీ మంత్రి.. అసలేమైంది? తోడేళ్లు అంటే యూపీ ప్రజలు, ప్రభుత్వం ఎందుకు గడగడలాడుతున్నది?
cloned wild Arctic wolf (Photo-Twitter)

Newdelhi, Sep 7: మానవ రక్తం (Human Blood) రుచి మరిగి ప్రాణాంతకంగా మారిన తోడేళ్ల (Wolves) బెడదతో యూపీలోని బహరాయిచ్‌ జిల్లా గడగడలాడుతున్నది. ఈ మృగాలను పట్టుకునేందుకు అనేక ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ అవి చిక్కడం లేదు. ఈ క్రమంలో యూపీ మంత్రి బేబీ రాణి మౌర్యా వింత వ్యాఖ్యలు చేశారు. ప్రభుత్వం కంటే తోడేళ్లు తెలివైనవని.. అందుకే వాటిని సులువుగా పట్టుకోలేకపోతున్నామన్నారు. మిగతా జంతువుల్లా బంధించడం అంత సులువు కాదని చెప్పారు.

తెలుగు రాష్ట్రాలకు కేంద్రం రూ.3,300 కోట్లు సాయం వార్తలన్నీ పుకార్లే, తమకు ఇంకా సమాచారమేమీ రాలేదని తెలిపిన సీఎం చంద్రబాబు

50 రోజులుగా భయం భయం

తోడేళ్ల భయంతో యూపీలోని పలు గ్రామాల పిల్లలు స్కూల్స్‌, కాలేజీలకు వెళ్లడం మానేశారు. మార్కెట్లు, దుకాణాలు బంద్‌ అయ్యాయి. రైతులు వ్యవసాయ క్షేత్రాలకు వెళ్లడానికే భయపడే దుస్థితి దాపురించింది. మాహ్సీ సబ్‌ డివిజన్‌లోని పలు గ్రామాలు భయంతో నిర్మానుష్యంగా మారిపోయాయి. గడిచిన 50 రోజులుగా జిల్లా వాసులు కంటిమీద కునుకులేకుండా బతుకుతున్నారు. నరమాంస భక్షక తోడేళ్ల దాడిలో 35 మంది ప్రజలు గాయపడ్డారు. 10 మంది ప్రాణాలు కోల్పోయారు.

టీడీపీ ఆఫీసుల్లో బాత్రూంల వద్ద కూడా సీసీటీవీ కెమెరాలు ఉన్నాయా ? వైసీపీ నేతల అరెస్ట్‌పై మండిపడిన మాజీ మంత్రి పేర్ని నాని

(The above story first appeared on LatestLY on Sep 07, 2024 09:03 AM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).