Monkeypox Case In India: దేశంలో మళ్ళీ మంకీపాక్స్ కలకలం.. దుబాయ్ నుంచి వచ్చిన వ్యక్తికి పాజిటివ్.. కర్ణాటకలో గుర్తింపు
దేశంలో మళ్లీ మంకీపాక్స్ కలకలం రేపుతోంది. దుబాయ్ నుంచి ఇటీవల తిరిగివచ్చిన 40 ఏళ్ల ఓ వ్యక్తికి మంకీపాక్స్ పాజిటివ్ గా తేలింది. కర్ణాటకలోని ఉడిపి జిల్లా కర్కాలకు చెందిన సదరు వ్యక్తి గడిచిన 19 ఏళ్లుగా దుబాయ్ లో ఉంటున్నాడు.
Bengaluru, Jan 24: దేశంలో మళ్లీ మంకీపాక్స్ (Monkeypox) కలకలం రేపుతోంది. దుబాయ్ (Dubai) నుంచి ఇటీవల తిరిగివచ్చిన 40 ఏళ్ల ఓ వ్యక్తికి మంకీపాక్స్ పాజిటివ్ గా తేలింది. కర్ణాటకలోని ఉడిపి జిల్లా కర్కాలకు చెందిన సదరు వ్యక్తి గడిచిన 19 ఏళ్లుగా దుబాయ్ లో ఉంటున్నాడు. ఓ పనిమీద ఈ నెల 17న మంగళూరుకు వచ్చాడు. ఈ క్రమంలో ఆయన శరీరంపై దద్దుర్లు రావడం, స్వల్పంగా జ్వరం వంటివి జరిగాయి. దీంతో ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చేరాడు. అనుమానం వచ్చిన వైద్యులు అతని శాంపిల్స్ తీసుకుని పూణెలోని నేషనల్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ ల్యాబ్ కు పంపించారు. ఈ క్రమంలోనే నమూనాలను పరీక్షించిన వైద్యులు మంకీపాక్స్ గా నిర్ధారించినట్లు రాష్ట్ర ఆరోగ్య, కుటుంబ మంత్రిత్వ శాఖ తెలిపింది.
A 40-year-old man from #Udupi District, #Karnataka tested positive for monkeypox after arriving from #Dubai.
He is now stable in isolation.
Know more 🔗 https://t.co/71jZcVc1zN pic.twitter.com/BkxqmFkW8o
— The Times Of India (@timesofindia) January 23, 2025
ఈ ఏడాది తొలి కేసు
ప్రస్తుతం రోగి పరిస్థితి నిలకడగానే ఉందని, అతన్ని ఐసోలేషణ్ లో ఉంచమని, త్వరలోనే ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యే ఛాన్స్ ఉందని వైద్య శాఖ పేర్కొంది. కాగా ఈ ఏడాది దేశంలో వెలుగు చూసిన మొదటి మంకీ పాక్స్ కేసు ఇదే. గత ఏడాది ఈ వ్యాధి తీవ్ర అందోళన కలిగిన సంగతి తెలిసిందే.
నిర్మాత దిల్ రాజు ఇల్లు, ఆఫీసుల్లో ముగిసిన ఐటీ సోదాలు.. గత మూడు రోజులుగా కొనసాగిన దాడులు
(The above story first appeared on LatestLY on Jan 24, 2025 09:55 AM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

