Republic Day 2024: అటారీ-వాఘా సరిహద్దులో బీటింగ్ రిట్రీట్ వేడుక, శివతాండవాన్ని తలపించిన భారత సైనికుల విన్యాసం, మీసం మెలేసిన బీఎస్‌ఎఫ్‌ జవాన్లు

భారతదేశ 75వ గణతంత్ర దినోత్సవ వేడుకల సందర్భంగా పంజాబ్‌లోని అమృత్‌సర్‌లోని అట్టారీ-వాఘా సరిహద్దులో బీటింగ్ రిట్రీట్ వేడుక(Beating Retreat Ceremony) జరిగింది.తమ శక్తిని చూడండంటూ భారత వీర సైనికులు రోషం, పౌరుషం చూపించారు.

Republic Day 2024: అటారీ-వాఘా సరిహద్దులో బీటింగ్ రిట్రీట్ వేడుక, శివతాండవాన్ని తలపించిన భారత సైనికుల విన్యాసం, మీసం మెలేసిన బీఎస్‌ఎఫ్‌ జవాన్లు
Beating Retreat Ceremony Held at Attari-Wagah Border (Photo-ANI)

New Delhi, Jan 26: భారతదేశ 75వ గణతంత్ర దినోత్సవ వేడుకల సందర్భంగా పంజాబ్‌లోని అమృత్‌సర్‌లోని అట్టారీ-వాఘా సరిహద్దులో బీటింగ్ రిట్రీట్ వేడుక(Beating Retreat Ceremony) జరిగింది.తమ శక్తిని చూడండంటూ భారత వీర సైనికులు రోషం, పౌరుషం చూపించారు.  పోటీ పడి మరీ పాక్‌ రేంజర్లను మించి కవాతు చేశారు. BSF సైనికుల విన్యాసాలు శివ తాండవాన్ని తలపించాయి. బీటింగ్‌ రిట్రీట్‌ కార్యక్రమంలో భాగంగా.. బీఎస్‌ఎఫ్‌ జవాన్లు , పాక్‌ రేంజర్లు….బోర్డర్‌ దగ్గర కదం తొక్కారు. ఇరుదేశాల సైనికుల కవాతు అందరిని ఆకట్టుకుంది.

ప్రతిరోజు వాఘాలో (Attari-Wagah Border) బీటింగ్‌ రిట్రీట్‌ కార్యక్రమం జరుగుతుంది. కానీ ఇవాళ జరిగిన వేడుకలకు (Occasion of 75th Republic Day) చాలా ప్రత్యేకతలు ఉన్నాయి. ఇరుదేశాల నుంచి వేలాదిమంది జనం ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. బీటింగ్ రిట్రీట్ వేడుక అనేది 17వ శతాబ్దానికి చెందిన వార్షిక సైనిక వేడుక, ఇది చారిత్రాత్మక ప్రాముఖ్యతను కలిగి ఉంది. అమృత్‌సర్ జిల్లాలో 75వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా అటారి-వాఘా సరిహద్దులో బీటింగ్ రిట్రీట్ వేడుకలో బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ (BSF) సిబ్బంది, పాకిస్తానీ రేంజర్లు ప్రదర్శన ఇచ్చారు.బీటింగ్ రిట్రీట్ వేడుకను చూసేందుకు జనం పెద్దఎత్తున తరలివచ్చారు.

వాఘా సమీపంలో భారత పాకిస్తాన్ సరిహద్దులో జాతీయ పతాకం అవనతం చేసే కార్యక్రమం. భారత్-పాక్ సరిహద్దు లాహోర్ నుండి 24 kilometres (15 mi) దూరంలోను, అమృత్‌సర్ నుండి32 kilometres (20 mi) దూరంలో ఉంది. ఈ సరిహద్దు ప్రాంతం అట్టారి గ్రామానికి 3 kilometres (1.9 mi)ల సమీపంలో ఉంది.

అటారీ-వాఘా సరిహద్దులో భారత్ సైన్యం బీటింగ్ రిట్రీట్ వేడుకలు, పాక్ సైనికుల ముందు భారత సైనికుల కవాతు వీడియో ఇదిగో..

భారత్-పాకిస్థాన్.. రెండు దేశాలకు ఒక్క గేటు మాత్రమే అడ్డు. అదే పంజాబ్‌లోని అట్టారీ, వాఘా సరిహద్దు. ఇక్కడ జరిగే బీటింగ్ రిట్రీట్ కార్యక్రమం చూడడానికి నిజంగా రెండు కళ్లు సరిపోవు. రెండు దేశాల సైనికులు ఎదురుపడి పరస్పరం సెల్యూట్ చేసుకోవడం చూస్తుంటే రోమాలు నిక్కబొడుచుకుంటాయి. అంత ఉద్విగ్నభరితంగా సాగింది బీటింగ్ రిట్రీట్. హిందుస్థాన్ జిందాబాద్ అనే నినాదాలు వినిపిస్తుండగా బీఎస్ఎఫ్ జవాన్‌లు పరేడ్ చేశారు. ఇరు దేశాల సైనికులు ఒకరిపై ఒకరు కలబడడానికి వెళుతున్నారా అన్నట్లు సాగింది ఈ కార్యక్రమం.

Here's Videos

అటారీ-వాఘా సరిహద్దులో 'ఫ్లాగ్-ఆఫ్' వేడుక లేదా జెండా ఉపసంహరణ వేడుక అనేది ప్రతిరోజు జరుగుతుంది. ఇది సెంట్రల్ ఆర్మ్‌డ్ పోలీస్ ఫోర్స్ (CAPF) ఆచారం, దీనిని భారతదేశ (సరిహద్దు భద్రతా దళం), పాకిస్తాన్ ( పాకిస్తాన్ రేంజర్స్) భద్రతా దళాలు 1959 నుండి సంయుక్తంగా అనుసరిస్తున్నాయి. ఇది రెండు దేశాల సైనికుల మధ్య సద్భావనను పెంపొందించడానికి ప్రారంభించబడింది, ఈ సంప్రదాయం నేటికీ కొనసాగుతోంది. ఫజిల్కా సమీపంలోని మహావీర్/సాద్కీ సరిహద్దులో, ఫిరోజ్‌పూర్ సమీపంలోని హుస్సేనివాలా/ గండా సింగ్ వాలా సరిహద్దులో ఇలాంటి కవాతులు నిర్వహించబడతాయి.

వేడుక ప్రారంభానికి 20 నిమిషాల ముందు లౌడ్ స్పీకర్ ద్వారా "హిందుస్థాన్ జిందాబాద్..", "సారే జహాసే అచ్చా...హిందుస్థాన్ హమారా.." వంటి దేశభక్తి నినాదాలు వెలువడతాయి. అప్పుడు పాకిస్తాన్ వైపు నుండి "పాకిస్తాన్ జిందాబాద్" వంటి నినాదాలు వెలువడతాయి. దీని తరువాత ఇద్దరు సైనికులు దూరం నుండి చురుకైన అడుగులతో కవాతు చేసి గేటు దగ్గర నిలబడతారు. పైభాగానికి తాకేలా పాదాలను పైకెత్తి నేలపై బలంగా కొట్టి పై అధికారుల నుంచి సెల్యూట్ తీసుకుంటారు. పాకిస్తాన్ కూడా అదే పరేడ్‌లను పునరావృతం చేస్తుంది. అప్పుడు గేటు తెరుచుకుంటుంది. పాకిస్తాన్, భారతదేశ ప్రజలు ఒకరినొకరు చూసుకుంటారు రెండు జెండాలు ఒక బగల్ తోడుగా ఒకేసారి దించబడతాయి. జెండా స్తంభానికి ఎదురుగా జెండాలు దించుతారు. వాటిని భద్రంగా మడతపెట్టి, గౌరవప్రదంగా వారి సంబంధిత భవనాలకు తీసుకెళ్లి గేట్లు మూసివేయడంతో వేడుక ముగుస్తుంది.

2 నవంబర్ 2014న, అటారీ-వాఘా సరిహద్దులో పాకిస్తాన్ వైపున జరిగిన ఆత్మాహుతి దాడిలో సుమారు 60 మంది మరణించారు, కనీసం 110 మంది పైగా గాయపడ్డారు. అటారీ-వాఘా సరిహద్దు వేడుక ముగిసిన వెంటనే, 18-20 సంవత్సరాల వయస్సు గల యువకుడు తన చొక్కాలో 5 కిలోల పేలుడు పదార్థాలను పెట్టుకొని, క్రాసింగ్ నుండి 500 మీటర్ల దూరంలో పేల్చాడు. 29 సెప్టెంబర్ 2016న, భారతదేశం-పాకిస్తాన్ సైనిక వివాదం కారణంగా వేడుక రద్దు చేయబడింది. అశాంతి కారణంగా, భారత సరిహద్దు భద్రతా దళం కూడా కొవ్వొత్తులను వెలిగించడం, పండుగలకు శుభాకాంక్షలను చెప్పడం నిలిపివేసింది.

(The above story first appeared on LatestLY on Jan 26, 2024 08:49 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).