Bengaluru Horror: దారుణం, మదర్సాలో బాలుడిపై టీచర్ పదే పదే అత్యాచారం, ఎవరికైనా చెబితే చంపేస్తానని బెదిరింపులు, చివరకు తల్లిదండ్రులకు ఘోరాన్ని చెప్పిన బాలుడు
బెంగళూరులోని మదర్సాలో చదువుతున్న 10 ఏళ్ల బాలుడిపై లైంగిక వేధింపులకు పాల్పడిన ఉపాధ్యాయుడిపై మహారాష్ట్రలోని థానే పోలీసులు కేసు నమోదు చేసినట్లు అధికారులు బుధవారం తెలిపారు.
Thane, Jan 31: బెంగళూరులోని మదర్సాలో చదువుతున్న 10 ఏళ్ల బాలుడిపై లైంగిక వేధింపులకు పాల్పడిన ఉపాధ్యాయుడిపై మహారాష్ట్రలోని థానే పోలీసులు కేసు నమోదు చేసినట్లు అధికారులు బుధవారం తెలిపారు.బాధితుడి తల్లిదండ్రులు థానే నగరంలోని షిల్-ఫాటా ప్రాంతంలో నివాసం ఉంటున్నారని, అందుకే వారు ఇక్కడి పోలీసులను ఆశ్రయించారని, దీనిపై మంగళవారం కేసు నమోదు చేసినట్లు పోలీస్ అధికారి తెలిపారు.
బాధితుడైన బాలుడు బెంగళూరులోని మదర్సాలో ఆగస్టు 2024 నుంచి జనవరి 2025 మధ్య చదువుతున్నాడు. 22 ఏళ్ల నిందితుడైన టీచర్ బాలుడిని గెస్ట్ రూమ్కు పిలిచేవాడు. అక్కడ అతను బాలుడిపై పలు సందర్భాల్లో లైంగిక వేధింపులకు పాల్పడ్డాడని ( madarsa teacher for sexually assaulting minor boy
) షిల్-దైఘర్ పోలీస్ స్టేషన్ అధికారి తెలిపారు. ఈ సంఘటన గురించి ఎవరికైనా చెబితే బాధితుడిని, అతని తండ్రిని చంపేస్తానని నిందితుడు బెదిరించాడని అధికారి తెలిపారు. అనంతరం జరిగిన నేరాన్ని బాలుడు తల్లిదండ్రులకు తెలియజేశాడు.
బాలుడి తల్లి ఫిర్యాదు మేరకు మంగళవారం నిందితుడిపై భారతీయ న్యాయ సంహిత సెక్షన్ 64 (రేప్), లైంగిక నేరాల నుంచి పిల్లల రక్షణ (పోక్సో) చట్టంలోని నిబంధనల కింద పోలీసులు కేసు నమోదు చేసినట్లు ఆయన తెలిపారు.ఈ కేసుపై విచారణ కొనసాగుతోందని పోలీసులు తెలిపారు.
(The above story first appeared on LatestLY on Jan 31, 2025 08:29 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

