Gujarat Morbi Cable Bridge: గుజరాత్ లోని మోర్బీలో కూలిన కేబుల్ బ్రిడ్జి, 32 మంది మృతి, ప్రమాదం సమయంలో బ్రిడ్జిపై 400 మంది జనం, కొనసాగుతున్న సహాయక చర్యలు, ప్రధాని మోదీ విచారం..
(Twitter/ ANI)

గుజరాత్‌లోని మోర్బీలో ఆదివారం సాయంత్రం ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. ఇక్కడ మచ్చు నదిలో నిర్మించిన కేబుల్ వంతెన ఒక్కసారిగా తెగిపోవడంతో పలువురు నదిలో పడిపోయారు. నది నుంచి ప్రజలను బయటకు తీసేందుకు సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. 

ప్రస్తుతం బ్రిడ్జి కూలడంతో ఎంత మంది నదిలో పడ్డారనేది తెలియరాలేదు, అయితే ప్రమాదం జరిగిన సమయంలో వంతెనపై సుమారు 400 మంది  జనం ఉన్నట్లు అక్కడ ఉన్న వారు తెలిపారు. రెస్క్యూ ఆపరేషన్‌లో స్థానికులు కూడా పోలీసులకు  సహాయం చేస్తున్నారు.

ఈ కేబుల్ బ్రిడ్జి చాలా పాతదని చాలా రోజులుగా దీనిపై సందర్శకులను అనుమతించడం లేదని, అయితే ప్రస్తుతం రిపేర్లు చేసిన తర్వాత 5 రోజుల క్రితం మాత్రమే ప్రారంభించినట్లు అధికారులు తెలిపారు. 

ఈ వంతెన మరమ్మతులు గత 7 నెలలుగా కొనసాగుతున్నాయి. ట్రస్ట్ ద్వారా పునరుద్ధరణ పనులు జరిగాయి. చాలా కాలం తర్వాత వంతెన ప్రారంభం కావడంతో ఆదివారం కుటుంబ సమేతంగా ప్రజలు భారీ సంఖ్యలో బ్రిడ్జి వద్దకు చేరుకుని ఫొటోలు, సెల్ఫీలు దిగారు.

ప్రమాదం తర్వాత, కేబుల్ వంతెన  అనేక చిత్రాలు తెరపైకి వచ్చాయి, ఇందులో వంతెన మధ్యలో నుండి విరిగిపోయి నదిలో మునిగిపోయింది. బ్రిడ్జి కూలిన తర్వాత, విరిగిన వంతెనను పట్టుకుని ఎలాగోలా తప్పించుకోవాలని ప్రయత్నిస్తున్న చాలా మంది మధ్యలో కూడా చిక్కుకున్నారు.

మోర్బీ ప్రమాదంపై ప్రధాని నరేంద్ర మోదీ గుజరాత్ సీఎం భూపేంద్ర పటేల్‌తో మాట్లాడారు. సహాయక చర్యల కోసం తక్షణమే బృందాలను సమీకరించాలని ఆయన కోరారు. ప్రధాని మోదీ పరిస్థితిని నిశితంగా  నిరంతరం పర్యవేక్షించాలని  బాధిత ప్రజలకు సాధ్యమైన అన్ని సహాయాన్ని అందించాలని కోరారు. ఈ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు రూ.2 లక్షలు, గాయపడిన వారికి రూ.50,000 చొప్పున ప్రధానమంత్రి జాతీయ సహాయ నిధి నుంచి ప్రధాని మోదీ ప్రకటించారు.

ప్రమాదంపై సంతాపం వ్యక్తం చేసిన హోంమంత్రి అమిత్ షా, 'మోర్బీలో జరిగిన ప్రమాదం పట్ల నేను చాలా బాధపడ్డాను. ఈ విషయమై గుజరాత్ హోం శాఖ సహాయ మంత్రి హర్ష్ సంఘ్వీతో పాటు పలువురు అధికారులతో మాట్లాడాను. స్థానిక యంత్రాంగం పూర్తి సంసిద్ధతతో సహాయక చర్యల్లో నిమగ్నమై ఉంది. ఎన్డీఆర్ఎఫ్ కూడా వెంటనే ఘటనా స్థలానికి చేరుకుంటుంది. క్షతగాత్రులకు తక్షణమే చికిత్స అందించాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.

ప్రమాదంపై గుజరాత్ సీఎం భూపేంద్ర పటేల్ విచారం వ్యక్తం చేశారు. సహాయక చర్యలు కొనసాగుతున్నాయని తెలిపారు. క్షతగాత్రులకు వెంటనే చికిత్స అందించేందుకు ఏర్పాట్లు చేయాలని సూచించారు. ఈ విషయంలో జిల్లా యంత్రాంగంతో నిరంతరం సంప్రదింపులు జరుపుతున్నాను. ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కూడా ట్విటర్ ద్వారా ప్రమాదంపై విచారం వ్యక్తం చేశారు.