Hyderabad Shocker: డాక్టర్తో పురుషుడి సెక్స్ ఛాటింగ్, అమ్మాయి ఛాట్ చేస్తుందనుకుని రూ. కోటి ముట్టచెప్పిన డాక్టర్, నిందితుడిని అరెస్ట్ చేసిన సైబర్ క్రైమ్ పోలీసులు
సికింద్రాబాద్ లోని పద్మారావునగర్కు చెందిన ఓ వైద్యుడిని డేటింగ్ యాప్కు బానిసగా మార్చి, 2020 నుంచి మూడు విడతల్లో రూ.కోటికి పైగా కాజేసిన ముఠాలో ఓ నిందితుడిని సిటీ సైబర్ క్రైమ్ పోలీసులు (Cyber crime police) ఢిల్లీలో పట్టుకున్నారు.
Hyd, Oct 7: సికింద్రాబాద్ లోని పద్మారావునగర్కు చెందిన ఓ వైద్యుడిని డేటింగ్ యాప్కు బానిసగా మార్చి, 2020 నుంచి మూడు విడతల్లో రూ.కోటికి పైగా కాజేసిన ముఠాలో ఓ నిందితుడిని సిటీ సైబర్ క్రైమ్ పోలీసులు (Cyber crime police) ఢిల్లీలో పట్టుకున్నారు. ఈ కేసులో ప్రధాన సూత్రధారుల కోసం గాలిస్తున్నామని సంయుక్త సీపీ డాక్టర్ గజరావ్ భూపాల్ తెలిపారు. ఏసీపీ కేవీఎం ప్రసాద్తో కలిసి మంగళవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన వివరాలు వెల్లడించారు.
పోలీసుల విడుదల చేసిన వివరాల ప్రకారం, నిందితుడు - అరుణ్ - మోహిత్, దీపక్, మంజీత్ మరియు నీతూ సోలంకితో కలిసి గిగోలో ప్లేబాయ్ సర్వీసెస్ పేరుతో డేటింగ్ యాప్ను (dating app) ప్రారంభించాడు. డేటింగ్ యాప్ ఖాతాదారులు అమ్మాయిలతో మాట్లాడేందుకు ఇది వీలు కల్పిస్తుంది.అరుణ్ మరియు అతని స్నేహితులు ఢిల్లీలో కాల్ సెంటర్లు ఏర్పాటు చేసి, ఖాతాదారులతో మాట్లాడటానికి అమ్మాయిలను రిక్రూట్ చేసుకున్నాడు.
అమ్మాయిలు ముచ్చటగా మాట్లాడి ఖాతాదారులకు డబ్బు బదిలీ చేయమని ఎర వేసేవారు. ఫిర్యాదుదారు వారి ఖాతాదారులలో ఒకరు. 2020 నుండి, అతను మొత్తం రూ. అరుణ్ వివిధ బ్యాంకు ఖాతాలకు 1,53,38,527 ఇచ్చారు. తొలుత ఒక ఖాతాలో రూ.22 లక్షలు, మరో ఖాతాలో రూ.8 లక్షలు బదిలీ చేయాలని ఫిర్యాదుదారుని కోరారు.తాను మోసపోయానని తెలుసుకున్న ఫిర్యాదుదారు హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. విచారణ అనంతరం అరుణ్ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
బాధితుడు ఎలా మోసపోయాడంటే..
వరంగల్లోని కాకతీయ వైద్య కళాశాల నుంచి వైద్య పట్టా పొందిన బాధిత డాక్టర్ కేంద్ర సర్వీసులో వైద్యుడిగా ఉన్నారు. ఈయన 2020లో జిగోలో ప్లేబాయ్ సర్వీసెస్ అనే డేటింగ్ యాప్ (Gigolo Playboy Services) డౌన్లోడ్ చేసుకున్నారు. ఈ డేటింగ్ యాప్ నిర్వాహకులే కొందరు యువతులను పురుషులతో ‘సెక్స్చాట్లు’ చేసేందుకు నియమించుకున్నారు. వీరు బాధితులతో చాటింగ్, ఫోన్ కాల్స్ చేస్తున్నారు.
ఈ నేపథ్యంలో నగరవాసి వారికి కాల్ చేయగా.. కొందరు మాట్లాడి కొన్ని ఫొటోలు పంపి వాటిలో ఉన్న యువతులు డేటింగ్కు సిద్ధమన్నారు. దానికోసం రిజిస్ట్రేషన్ చేసుకుని, కొంత మొత్తం అడ్వాన్స్గా చెల్లించాలంటూ తమ బ్యాంకు ఖాతా వివరాలు అందించారు. అలా ఆ ఏడాది జూన్ 6 నుంచి ఈ వైద్యుడు పలు ధపాలుగా చెల్లింపులు మొదలెట్టారు.అనంతరం వారు యువతి వాట్సప్ నంబర్ ఇచ్చి అందులో ఛాటింగ్ చేసుకోవాలని తెలిపారు. అయితే అది పురుషులే ఛాట్ చేస్తున్నప్పటికీ బాధిత డాక్టర్ అమ్మాయనుకుని వారితో ఛాటింగ్ చేశాడు.
తమను కలుసుకోవాలంటే మరికొంత మొత్తం చెల్లించాలని ఛాటింగ్ లో తెలిపారు. వైద్యుడు నమ్మేయడంతో పలు దఫాలుగా నగదు వారి అకౌంట్లో వేశారు. ప్రతి సందర్భంలోనూ చెల్లించిన మొత్తంలో కొంత రిఫండ్ అన్నారు. ఏ దశలో అయినా డబ్బు చెల్లించడం ఆపేస్తే ఏమాత్రం తిరిగి రాదంటూ బాధితుడిని బెదిరించారు. దీంతో బాధితుడు 2020 అక్టోబర్ వరకు రూ.41.5 లక్షలు, కొంత విరామం ఇచ్చినా 2021 మార్చి వరకు మరో రూ.30 లక్షలు చెల్లించాడు.
మొత్తం మూడు దఫాలుగా మొత్తం రూ.1.53 కోట్లు వారికి పంపాడు. ఈ ఘటనకు సంబంధించి రెండుసార్లు కేసు నమోదైనా బాధితుడి ఒత్తిడితోనే అది మూతపడింది. చివరకు జూలైలో మరో కేసు నమోదు చేసుకున్న సైబర్ క్రైమ్ పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఢిల్లీకి చెందిన అరుణ్ ఖాతాలో రూ.30 లక్షలు పడినట్లు గుర్తించి అతడిని అరెస్టు చేశారు. ఈ కేసుకు సంబంధించి పరారీలో ఉన్న సూత్రధారులు మోహిత్, దీపక్, మంజిత్, నీతు, సోలంకి కోసం గాలిస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించి అన్ని ఆధారాలు తీసుకురావాలని ఫిర్యాదుదారుని కోరినట్లు సైబర్ క్రైమ్ ఏసీపీ కేవీఎం ప్రసాద్ తెలిపారు.
(The above story first appeared on LatestLY on Oct 06, 2022 12:49 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

